తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సరదాలు ఇప్పుడు లేవు: శ్రద్ధా కపూర్ - శ్రద్ధా కపూర్ ఇంటర్వ్యూ

స్టార్ ఇమేజ్ రావడం వల్ల కొన్ని సరదాలను కోల్పోయానని చెప్పింది హీరోయిన్ శ్రద్ధా కపూర్. ప్రస్తుతం స్ట్రీట్ డ్యాన్సర్, భాఘీ 3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ.

శ్రద్ధా

By

Published : Oct 19, 2019, 7:46 PM IST

'సాహో'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌. బాలీవుడ్​లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఈ భామ.. బోలెడంత స్టార్‌డమ్‌ సంపాదించింది. కానీ ఈ ఇమేజ్‌ వలన చాలా కోల్పోయానని అంటోంది.

"సినిమాల్లోకి రాకముందు ఇంటి నుంచి చాలా స్వేచ్ఛగా మార్కెట్‌కు వెళ్లేదాన్ని. ముంబయి కార్టర్‌ రోడ్‌లో హాయిగా తిరిగేదాన్ని. రిక్షాల్లో ప్రయాణం, స్నేహితులతో కలిసి కాఫీషాప్​కు వెళ్లడం, సేవ్‌ పూరి, వడా పావ్‌.. ఇలా ఎన్నో సరదాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు కుదరడం లేదు" -శ్రద్ధా కపూర్, హీరోయిన్

ఇటీవలే విడుదలైన తన సినిమాల వసూళ్లపైనా మాట్లాడిందీ శ్రద్ధా కపూర్.

శ్రద్ధా కపూర్

"వసూళ్లను బట్టే ఎంతమంది ఆ సినిమాను చూశారనేది తెలిసిపోతుంది. కలెక్షన్లు బాగున్నాయంటే ఎక్కువమంది చూసినట్టే కదా. చిత్రం బాగుంది అనే మాటతో పాటు వసూళ్లు చాలా కీలకం" --శ్రద్ధా కపూర్, హీరోయిన్

ఓ పక్క మాస్‌మసాలా సినిమాలు చేస్తూనే మరో పక్క నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలతోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం డ్యాన్స్‌ నేపథ్యంగా సాగే ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌, టైగర్‌ ష్రాఫ్‌తో ‘బాఘీ 3’ల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇవీ చూడండి.. రైలు టికెట్​కు డబ్బుల్లేక..​ ప్రేమలో విఫలమై

ABOUT THE AUTHOR

...view details