'సాహో'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్. బాలీవుడ్లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఈ భామ.. బోలెడంత స్టార్డమ్ సంపాదించింది. కానీ ఈ ఇమేజ్ వలన చాలా కోల్పోయానని అంటోంది.
"సినిమాల్లోకి రాకముందు ఇంటి నుంచి చాలా స్వేచ్ఛగా మార్కెట్కు వెళ్లేదాన్ని. ముంబయి కార్టర్ రోడ్లో హాయిగా తిరిగేదాన్ని. రిక్షాల్లో ప్రయాణం, స్నేహితులతో కలిసి కాఫీషాప్కు వెళ్లడం, సేవ్ పూరి, వడా పావ్.. ఇలా ఎన్నో సరదాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు కుదరడం లేదు" -శ్రద్ధా కపూర్, హీరోయిన్
ఇటీవలే విడుదలైన తన సినిమాల వసూళ్లపైనా మాట్లాడిందీ శ్రద్ధా కపూర్.