తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మహాభారతం'లో బాలీవుడ్ బిగ్ స్టార్స్

ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాన్ని కథాంశంగా తీసుకుని ఇప్పటివరకు చాలానే సినిమాలొచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్​లో మళ్లీ ఈ ట్రెండ్ మొదలైంది. ప్రముఖ నిర్మాత మధు మంతెన రామాయణ, మహాభారత కథలతో సినిమాలను రూపొందిస్తున్నాడు. ఇందులో కృష్ణుడు, ద్రౌపది పాత్రలపై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది.

By

Published : Dec 25, 2019, 9:47 AM IST

Updated : Dec 25, 2019, 10:17 AM IST

. hrithik deepika as krishna and droupathi
హృతిక్​ - దీపికా

మనదేశంలో ఇతిహాసాలకు కొదవలేదు. కొన్నింటిని తెరపైకి తీసుకురావడం అంతా సాధరణ విషయం ఏమీ కాదు. అయితే తాజాగా బాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన విషయం గురించి చర్చించుకుంటున్నారు. గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ కృష్ణుడిగా, ప్రముఖ నటి దీపిక పదుకొణె ద్రౌపదిగా నటించనున్నారని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

రామాయణ, మహాభారత చిత్రాలు నిర్మించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత మధు మంతెన ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే ఇప్పటికే నితీష్‌ తివారి దర్శకత్వంలో రామాయాణాన్ని మూడు భాగాలు విభజించి సినిమాగా తీయాలని అనుకుంటున్నాడట. మహాభారతాన్ని కూడా రెండు భాగాలు తెరకిక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు హిందీ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

కృష్ణుడు-ద్రౌపది

మహాభారతం అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పాత్రలు కృష్ణుడు, ద్రౌపది. అలాంటి పాత్రల్లో నటించాలంటే హృతిక్‌ రోషన్, దీపిక పదుకొణెలు సరిగ్గా సరిపోతారని చెప్పుకుంటున్నాయి సినీ వర్గాలు. మహాభారతం మొదటి భాగాన్ని 2021 దీపావళి పండుగ నాటికి తెరపైకి తీసుకొచ్చేందుకు మధు మంతెన సన్నాహాలు చేస్తున్నాడట. మధుకు నటుడు హృతిక్‌తో చాలా మంచి సంబంధం ఉంది. ఈ ఏడాది విడుదలైన 'సూపర్‌ 30' చిత్రానికి అతడే నిర్మాతగా వ్యవహరించాడు.

Last Updated : Dec 25, 2019, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details