తెలంగాణ

telangana

By

Published : Aug 4, 2019, 6:05 PM IST

ETV Bharat / sitara

ట్రెండింగ్: పవర్​స్టార్​తో గ్యాంగ్​స్టర్​ సెల్ఫీ

తన కొత్త సినిమా 'రణరంగం' ట్రైలర్​ లాంచ్​కు వెళుతూ పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​తో సెల్ఫీ దిగాడు యువ హీరో శర్వానంద్. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ను అనుకోకుండా కలిసిన హీరో శర్వానంద్

మనం ఓ పని గురించి వెళ్తుంటే అనుకోకుండా అభిమాన హీరో కనిపిస్తే ఆ ఆనందమే వేరు. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు. ప్రస్తుతం అయితే ఓ సెల్ఫీ దిగుతారు. యువ హీరో శర్వానంద్ అదే చేశాడు. తన కొత్త చిత్రం 'రణరంగం' ట్రైలర్​ లాంచ్​ కోసం కాకినాడ వెళ్తుండగా పవర్​స్టార్​ పవన్​కల్యాణ్ ​ఎదురుపడ్డాడు. అంతే చటుక్కున సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ చిత్రం నెట్టింట వైరల్​గా మారింది.

హీరో శర్వానంద్​ ఫేస్​బుక్ పోస్ట్

మాఫియా నేపథ్యంలో రూపొందిన 'రణరంగం'లో గ్యాంగ్​స్టర్​గా కనిపించనున్నాడు శర్వా. ట్రైలర్​ను త్రివిక్రమ్​ చేతుల మీదుగా కాకినాడలో నేడు విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్​, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇది చదవండి: ఎన్​కౌంటర్​ శంకర్​తో 'ఇస్మార్ట్​ శంకర్'

ABOUT THE AUTHOR

...view details