తెలంగాణ

telangana

ఆస్పత్రి నుంచి సాయితేజ్​ డిశ్చార్జ్​.. చిరు ట్వీట్​

ఇటీవల(sai dharam tej discharge) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు చిరు తెలిపారు(sai dharam tej chiranjeevi). నేడు(అక్టోబర్​ 15) తేజ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా విషెస్‌ చెప్పారు.

By

Published : Oct 15, 2021, 11:36 AM IST

Published : Oct 15, 2021, 11:36 AM IST

sai
సాయి తేజ్​

నటుడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej discharge) అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయినట్లు ట్వీట్​ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విజయ దశమి తమకు మరింత ప్రత్యేకమైనదిగా పేర్కొంటూ సాయితేజ్​తో(sai dharam tej chiranjeevi) కలిసి దిగిన ఫోటోను పోస్ట్​ చేశారు. తేజ్​కు ఇది పునర్జన్మలాంటిదన్న చిరు.. అతను పూర్తిగా కోలుకోవటం సంతోషంగా ఉందని అన్నారు.

ఇక తేజ్(saidharam tej birthday)​ పుట్టిన రోజు ఈరోజే(అక్టోబర్​ 15) కావటం విశేషం. పలువురు సెలబ్రెటీలు సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్​లో పోస్టులు చేశారు.

సెప్టెంబర్ 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్(saidharam tej road accident) అప్పటి నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కాలర్ బోన్ శస్త్రచికిత్స(saidharam tej surgery) అనంతరం ఫిజియో థెరపి చేస్తునట్టు ఇటీవల తేజ్​ సోదరుడు వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. దాదాపు 35 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సాయితేజ్ కోలుకుని డిశ్చార్జ్ కావటం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: సాయితేజ్​ కాలర్​ బోన్​ సర్జరీ విజయవంతం

ABOUT THE AUTHOR

...view details