రియా చక్రవర్తికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై ఎటువంటి కథనాలు మీడియాలో ప్రసారం చేయకుండా సమాచార శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
రకుల్ పిటిషన్పై కేంద్రానికి హైకోర్టు నోటీసులు - Rakul Preet Singh's plea
డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న మీడియా కథనాలను నిలిపివేయాలంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ వ్యవహారంపై కేంద్రానికి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
![రకుల్ పిటిషన్పై కేంద్రానికి హైకోర్టు నోటీసులు నాపై వస్తున్న కథనాలు ఆపేయాలి: హైకోర్టుకు రకుల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8831678-83-8831678-1600323224974.jpg)
నాపై వస్తున్న కథనాలు ఆపేయాలి: హైకోర్టుకు రకుల్
రకుల్ పిటిషన్పై అభిప్రాయం చెప్పాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ, ప్రసార భారతి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రకుల్కు సంబంధించి కథనాలు ప్రచురించడంలో మీడియా స్వీయ నియంత్రణ పాటిస్తుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
అక్టోబర్ 15న ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ జరగనుంది.
Last Updated : Sep 17, 2020, 2:59 PM IST