తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గోపీచంద్ కొత్త సినిమా షురూ..!

టాలీవుడ్ హీరో గోపీచంద్.. బిను సుబ్రహ్మణ్యం అనే కొత్త దర్శకుడితో ఓ యాక్షన్ - అడ్వెంచర్ సినిమా చేయబోతున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

By

Published : Sep 13, 2019, 8:45 PM IST

Updated : Sep 30, 2019, 12:24 PM IST

గోపీచంద్

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ హీరో గోపీచంద్. త్వరలో చాణక్య చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మరో సినిమాను పట్టాలెక్కించాడు. బినుసుబ్రహ్మణ్యం అనే నూతన దర్శకుడితో ఓ యాక్షన్ - అడ్వెంచర్ చేయబోతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్​లో జరిగాయి.

ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. సతీశ్ కరుప్ కెమెరామాన్​. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనేది త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.

ప్రస్తుతం చాణక్యతో బిజీగా ఉన్నాడు గోపీచంద్. ఇందులో మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలు. తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చదవండి: సందీప్‌ రణ్‌బీర్‌కు కథ చెప్పాడట..!

Last Updated : Sep 30, 2019, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details