ప్రముఖ కథానాయిక కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్ లక్ సఖి'. ఈ చిత్ర విడుదల తేదీలు మారిన తీరు చూస్తే.. పేరులో ఉన్న లక్ లేనట్లు కనిపిస్తుంది. ఎప్పటినుంచో థియేటర్లలో చిత్రం విడుదల చేద్దామనుకుంటున్నారు. కానీ కుదురడం లేదు. విడుదల తేదీలు వరుసగా మారుతూనే ఉన్నాయి.
గతేడాది నవంబరు 26న విడుదల చేయలనుకున్నారు కానీ.. కొన్ని రోజులకే ఆ నిర్ణయం మార్చుకున్నారు. డిసెంబరు 10న 'గుడ్లక్ సఖి' రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ డిసెంబరు 31న థియేటర్లలోకి తీసుకొస్తామని పోస్టర్ విడుదల చేశారు. అప్పుడు కూడా విడుదల కాలేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను చిత్రబృందం కొట్టిపారేసింది. మరో కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించింది. 'సఖి వచ్చేస్తోంది' అంటూ కీర్తి సురేశ్ ట్విట్టర్లో పేర్కొంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ షూటర్ పాత్రలో కనిపించనుంది. ఓ పల్లెటూరి అమ్మాయి జాతీయ స్థాయి షూటర్గా ఎలా ఎదిగిందనేదే సినిమా
షూటింగ్ నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో కీర్తి సురేశ్.. గిరిజన యువతిగా నటించింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు.