తెలంగాణ

telangana

పీపీఈ కిట్ల కోసం ప్రపంచసుందరి పెయింటింగ్స్​ వేలం

By

Published : Aug 19, 2020, 2:32 PM IST

Updated : Aug 19, 2020, 3:34 PM IST

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్​ తనలోని మానవతా దృక్పథాన్ని చాటుకుంది. కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. తాను వేసిన పెయింటింగ్స్​ను అమ్మి.. వచ్చిన సొమ్ముతో వారికి పీపీఈ కిట్లు అందజేయనున్నట్లు వెల్లడించింది.

former miss world Manushi Chhillar auctions her painting to raise funds for frontline workers
మనసు చాటుకున్న మాజీ ప్రపంచసుందరి మానుషి చిల్లర్​

మాజీ మిస్‌ వరల్డ్‌, నటి మానుషి చిల్లర్‌ మానవతా హృదయాన్ని చాటుకుంది. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌‌ వారియర్స్‌కు చేయూతనందించేందుకు.. తన పెయింటింగ్స్‌ను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. 'స్మైల్‌' స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆన్‌లైన్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనుంది. ఈ విధంగా పోగైన డబ్బును కొవిడ్‌ వారియర్స్‌తో పాటు వారి కుటుంబాలకు పీపీఈ కిట్లు అందించేందుకు ఉపయోగించనున్నట్లు స్పష్టం చేసింది.

"ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నాం. కానీ రైతులు, ట్రక్‌ డ్రైవర్లు, అనేక మంది కార్మికులు, ఫ్రంట్​లైన్​ వర్కర్లు మన కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. మనసుతో మనకోసం పనిచేస్తున్న వీరందరికి 'స్మైల్‌' ఫౌండేషన్‌ ద్వారా పీపీఈ కిట్లు అందించనున్నాం. కష్ట సమయంలో మన కోసం పనిచేస్తున్న హీరోలపై పెయింటింగులు రూపొందించాను. వాటిని ఇప్పుడు వేలం వేయగా వచ్చిన సొమ్ముతో పీపీఈ కిట్లను అందిస్తాం".

- మానుషి చిల్లర్​, మాజీ ప్రపంచ సుందరి

యశ్​రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న 'పృథ్వీరాజ్‌' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది మానుషి చిల్లర్‌. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు యశ్​రాజ్​ ఫిల్మ్స్​ నిర్మించబోతున్న కామెడీ డ్రామాలో నటుడు విక్కీ కౌశల్​ పక్కన కనువిందు చేయనుంది. యశ్​రాజ్ సంస్థ​ 50వ వార్షికోత్సవ ప్రాజెక్టులలో ఇదే ముఖ్యమైన చిత్రంగా తెరకెక్కనుంది. ఈ చిత్రంలోని ఇతర నటులతో సహా పూర్తి వివరాలను సెప్టెంబరు 27న ప్రకటించనుంది నిర్మాణ సంస్థ.

Last Updated : Aug 19, 2020, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details