తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2020, 3:56 PM IST

ETV Bharat / sitara

దర్శక నిర్మాత అనురాగ్​ కశ్యప్​పై ఎఫ్​ఐఆర్​

డైరెక్టర్​ అనురాగ్​ కశ్యప్​పై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నటి పాయల్​ ఘోష్​ కేసు పెట్టిన కారణంగా త్వరలో అతడిని విచారణకు పిలవనున్నారు.

Anurag
అనురాగ్

బాలీవుడ్​ దర్శకనిర్మాత అనురాగ్​ కశ్యప్​పై ముంబయి పోలీసులు, బుధవారం ఎఫ్​ఐఆర్​ను నమోదు చేశారు. ఏడేళ్ల క్రితం తనపై అనురాగ్, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి పాయల్​ ఘోష్​ ఇటీవలే ఆరోపించింది. ఈ క్రమంలోనే మంగళవారం ఫిర్యాదు చేసింది. త్వరలోనే అనురాగ్​ను విచారణకు పిలిపించనున్నట్లు అధికారులు తెలిపారు.

తనపై వస్తున్న ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని అనురాగ్​ కొట్టిపారేశారు. ఇతడికి మద్దతుగా పలువులు సెలబ్రిటీలు సోషల్​మీడియాలో పోస్ట్​లు పెట్టారు. అనురాగ్​ దోషిగా తేలితే, అతడితో సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంటానని చెప్పింది. మహిళా సాధికారత కోసం పోరాడే వ్యక్తులో అనురాగ్​ ఒకరని తెలిపింది.

ఇదీ చూడండి:లైంగిక ఆరోపణలపై అనురాగ్​ చట్టపరమైన చర్యలు!​

ABOUT THE AUTHOR

...view details