తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆసక్తికర మల్టీస్టారర్​లో హీరో రానా

భారత్​-పాక్ యుద్ధం(1971) నేపథ్యంలో 'భుజ్:ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమాను బాలీవుడ్​లో తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్​లోని రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ ప్రారంభమైంది.

By

Published : Jun 26, 2019, 4:24 PM IST

ఆసక్తికర మల్టీస్టారర్​లో హీరో రానా

బాలీవుడ్‌లో మరో ఆసక్తికర మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ హీరోలు సంజయ్‌ దత్, అజయ్‌ దేవగణ్‌లతో పాటు తెలుగు కథానాయకుడు రానా నటిస్తున్న ఆ చిత్రమే ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’. సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భారత్‌ - పాకిస్థాన్‌ యుద్ధం(1971) నేపథ్యంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ యుద్ధంలో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన విజయ్‌ కర్నిక్‌ అనే ఎయిర్‌ ఫోర్స్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌గా అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్నాడు. ఆర్మీ అధికారిగా రానా, భారత సైనిక దళానికి సహకరించే ఓ పౌరుడిగా సంజయ్‌ దత్‌ కనిపించనున్నారు.

సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్

అభిషేక్‌ దుదైయ్యా దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం హైదరాబాద్​లోని రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. సంజయ్‌ దత్‌పై యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలను తీస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నారు.

ఇది చదవండి: షాహిద్ కపూర్ కెరీర్​లో తొలిసారి ఇలా..!

ABOUT THE AUTHOR

...view details