తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2020, 10:40 AM IST

ETV Bharat / sitara

మహేశ్, అర్జున్​.. విడుదల తేదీ చెప్పండయ్యా..!

మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ ఈ రెండు సినిమాలు విడుదల తేదీపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

issue
మహేశ్

తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి పెద్ద పండగ. ఈ సీజన్​ను నమ్ముకుని ఎన్నో సినిమాలను విడుదల చేద్దామని ప్రయత్నిస్తుంటారు నిర్మాతలు. చిన్న సినిమాలు ముందుగానో, వెనకనో రావాల్సిందే. పెద్ద చిత్రాలు మాత్రం ముందే విడుదల తేదీలను ప్రకటిస్తాయి. కొన్నిసార్లు డేట్లు సర్దుబాటు కాక తిప్పలుతప్పవు. నెల, రెండు నెలల ముందే ఓ క్లారిటీకి వస్తే బాగుంటుంది. కానీ పండగ దగ్గరపడుతున్నా ఓ రెండు సినిమాలు మాత్రం ఇప్పటికీ విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకపోవడం అభిమానుల్ని అసహనానికి గురి చేస్తోంది.

మహేశ్​బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సంక్రాంతికి రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదల తేదీపై అవగాహన ఒప్పందం కూడా చేసుకున్నారు నిర్మాతలు. 'సరిలేరు నీకెవ్వరు' 11న, 'అల వైకుంఠపురములో' 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఏమో ఇప్పుడు విడుదల తేదీపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నారు.

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 'అల వైకుంఠపురములో' చిత్రానికి తొలిరోజు 60 శాతం థియేటర్లు ఇవ్వాలట 'సరిలేరు నీకెవ్వరు' నిర్మాతలు. కానీ ఇప్పుడు వారు 40 శాతానికి మించి ఇవ్వమని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా బన్నీ నిర్మాతలు 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా 'సరిలేరు నీకెవ్వరు' నిర్మాతలు కూడా తమ విడుదల తేదీ మార్పు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ 'అల వైకుంఠపురములో' జనవరి 10న వస్తే తాము కూడా అదే తేదీన పోటీగా విడుదల చేయాలని చూస్తున్నారట. పండగ ఇంకా వారం రోజులు కూడా లేని సమయంలో ఇంకా విడుదల తేదీ విషయంలో స్పష్టత లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇవీ చూడండి.. మళ్లీ పేరు మార్చుకున్న జాన్వీ, రాజ్​కుమార్​ల చిత్రం

ABOUT THE AUTHOR

...view details