టాలీవుడ్లో మరో వైవిధ్యమైన చిత్రం 'ఫలక్నుమా దాస్' తెరపైకి రాబోతుంది. 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఉత్తేజ్ కీలక పాత్రలో, ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీసు అధికారిగా నటించిన ఈ సినిమా టీజర్ను చిత్ర బృందం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసింది.
పాతబస్తీలోని ఫలక్నుమా పరిసర ప్రాంతాల్లో జరిగే సంఘటనలు, వ్యక్తుల వ్యవహార శైలి నేపథ్యంగా ఈ చిత్రం సాగనుంది. కరాటే రాజు సమర్పణలో జయచంద్ర, గోపాల్ ఉపాధ్యాయ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.