తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్లాసూ, మాసూ ప్రేక్షకులను అలరించే 'సూపర్​ మచ్చి'

ఓ పాట సహా మిగిలిన చిత్రీకరణ అంతా పూర్తయ్యిందని అంటున్నారు 'సూపర్​ మచ్చి' నిర్మాతలు. కల్యాణ్​ దేవ్​, రచితా రామ్​లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అటు క్లాస్​, ఇటు మాస్​ ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు.

By

Published : Sep 20, 2020, 6:54 AM IST

Except for one song, Super Machi completes the rest of the shooting
క్లాసూ, మాసూ ప్రేక్షకులను అలరించే 'సూపర్​ మచ్చి'

కల్యాణ్‌ దేవ్‌, రచితా రామ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'సూపర్‌ మచ్చి'. పులి వాసు దర్శకుడు. రిజ్వాన్‌, ఖుషి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. దీనిలో భాగంగా కల్యాణ్‌ దేవ్‌, రాజేంద్రప్రసాద్‌లపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. తమన్‌ బాణీలందించిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్‌ సాహిత్యమివ్వగా.. ఆనీ మాస్టర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. "చక్కటి ప్రేమకథతో నిండిన కుటుంబ కథా చిత్రమిది. కల్యాణ్‌ దేవ్‌ పాత్ర ఇటు కుటుంబ ప్రేక్షకుల్ని, అటు మాస్‌ ప్రేక్షకుల్నీ అలరించేలా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్‌, నరేశ్​ పంచే వినోదం అమితంగా ఆకట్టుకుంటుంది. తమన్‌ ఇచ్చిన ఐదు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటతో పాటు మరో గీతాన్ని చిత్రీరించాల్సి ఉంది" అన్నారు. ఈ చిత్రానికి కళ: బ్రహ్మ కడలి, కూర్పు: మార్తండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు.

ABOUT THE AUTHOR

...view details