తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి ఒకే వేదికపై నందమూరి హీరోలు

నందమూరి బాలకృష్ణ, జూనియర్​ ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​.. మళ్లీ ఒకే వేదికపై కనిపించనున్నారు. కల్యాణ్​రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' ప్రీరిలీజ్​ ఈవెంట్​లో ఈ ముగ్గురు సందడి చేయనున్నారని టాక్.

By

Published : Dec 30, 2019, 5:56 PM IST

Updated : Dec 30, 2019, 6:44 PM IST

Entha manchi vaadavura movie pre release event on january 8,2020
నందమూరి హీరోలు.. మరోసారి ఒకే వేదికపై

నందమూరి హీరోలు.. బాలకృష్ణ, కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌ మళ్లీ కలవబోతున్నారా? ఒకే వేదికపై కలిసి సందడి చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. కల్యాణ్​రామ్​ నటించిన 'ఎంత మంచివాడవురా' ముందస్తు విడుదల వేడుక.. జనవరి 8న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోదరుడు ఎన్టీఆర్‌తో పాటు బాబాయ్‌ బాలకృష్ణను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, ఈ ముగ్గురు నందమూరి కథానాయకులు.. ఒకే వేదికపై సందడి చేయడమిది ముచ్చటగా మూడోసారి కానుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

ఎంత మంచివాడవురా చిత్రంలో కల్యాణ్​రామ్​

ఈ ముగ్గురు హీరోలు గతంలో 'అరవింద సమేత', 'ఎన్టీఆర్‌ బయోపిక్‌' వేడుకల్లో ఒకే వేదికపై దర్శనమిచ్చారు.

కల్యాణ్ రామ్​-సతీశ్ వేగేశ్న కాంబినేషన్​లో 'ఎంత మంచివాడవురా' రూపొందింది. మెహరీన్‌ హీరోయిన్. గోపీసుందర్​ సంగీతమందించాడు. ఉమేశ్ గుప్తా, సుభాశ్ గుప్తాలు సంయుక్తంగా నిర్మించారు. జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి:- నేచురల్​ స్టార్​ నానితో రౌడీ హీరో మరోసారి!

Last Updated : Dec 30, 2019, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details