తెలంగాణ

telangana

లిరికల్ పాట: ఎన్నెన్నె కథలే చూసినా

By

Published : Jul 30, 2019, 8:07 PM IST

'ఎవరు' సినిమాలో ఎన్నెన్నో కథలే అంటూ సాగే లిరికల్​ గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. అడివి శేష్​, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించారు.

లిరికల్ పాట: ఎన్నెన్నె కథలే చూసినా

అడివి శేష్​ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఎవరు'. ఇందులోని ఎన్నెన్నో కథలే చూసినా అంటూ సాగే లిరికల్ గీతం మంగళవారం విడుదలైంది. చిన్మయి ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. రెజీనా హీరోయిన్​గా నటించింది. నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్టు 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మర్డర్​ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో అవినీతి పోలీసు అధికారి పాత్రలో శేష్​ నటించాడు. వెంకట్​ రాంజీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పీవీపీ బ్యానర్​పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతమందించాడు.

ఇది చదవండి: గుసగుస: మళ్లీ సినిమాల్లోకి పవన్..?

ABOUT THE AUTHOR

...view details