అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఎవరు'. ఇందులోని ఎన్నెన్నో కథలే చూసినా అంటూ సాగే లిరికల్ గీతం మంగళవారం విడుదలైంది. చిన్మయి ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. రెజీనా హీరోయిన్గా నటించింది. నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్టు 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
లిరికల్ పాట: ఎన్నెన్నె కథలే చూసినా - నవీన్ చంద్ర
'ఎవరు' సినిమాలో ఎన్నెన్నో కథలే అంటూ సాగే లిరికల్ గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. అడివి శేష్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించారు.
![లిరికల్ పాట: ఎన్నెన్నె కథలే చూసినా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3989412-644-3989412-1564491992931.jpg)
లిరికల్ పాట: ఎన్నెన్నె కథలే చూసినా
మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో అవినీతి పోలీసు అధికారి పాత్రలో శేష్ నటించాడు. వెంకట్ రాంజీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పీవీపీ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతమందించాడు.
ఇది చదవండి: గుసగుస: మళ్లీ సినిమాల్లోకి పవన్..?