తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మరో బ్రాండ్​కు ప్రచారకర్తగా వరుణ్ ధావన్'

ప్రముఖ బ్రాండ్ ఇమామీ... వరుణ్ ధావన్​ను 'నవరత్న కూల్​'కు బ్రాండ్ అంబాసిడర్​గా ఎంపికచేసింది.

By

Published : Apr 9, 2019, 3:28 PM IST

వరుణ్ ధావన్

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. ప్రముఖ హెయిర్ ఆయిల్ నవరత్నకు బ్రాండ్ అంబాసిడర్​గా పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని ఇమామీ కంపెనీ ధ్రువీకరించింది. ఈ వారం నుంచే సంబంధిత ప్రకటనలు వస్తాయని తెలిపింది.

ఇప్పటికే బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, గోవింద, హీరోయిన్ శిల్పాశెట్టితో పాటు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ అంబాసిడర్లుగా వ్యవహరించారు.

"వరుణ్​ను ప్రచారకర్తగా ఎంచుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మార్కెట్​ను మరింత విస్తరించే దిశగా దృష్టిసారించాం. వరుణ్ అంబాసిడర్​గా వ్యవహరించడం వల్ల వినియోగదారులు పెరుగుతారని ఆశిస్తున్నాం".

- హర్ష అగర్వాల్, ఇమామీ డైరక్టర్

ABOUT THE AUTHOR

...view details