తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఏకాంతాల చెరలో ఊహలు చెప్పే కథలు వింటారా!

ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న 'దొరసాని' చిత్రంలో వీడయో సాంగ్ విడుదలైంది. "కళ్లల్లో కలవరమై" అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

By

Published : Jul 8, 2019, 7:08 PM IST

దొరసాని

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న చిత్రం 'దొరసాని'. ఈ సినిమాలోని "కళ్లలో కలవరమై" వీడియో సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్​గా అరంగేట్రం చేస్తోంది.

"ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా.. ఊహలే ఎన్నో కొంటే కథలే చెప్పగా" అంటూ సాగే ఈ ప్రేమ గీతం ఆకట్టుకుంటోంది. "ఊరించే ఊసులు ఎన్నో.. ఉడికిస్తూ చంపుతుంటే.. ఆ తపనలోన తనువు తుళ్లి పడుతుంటే" అంటూ ముగుస్తుంది వీడియో సాంగ్​.

శ్రేష్టిత సాహిత్యం అందించిన ఈ పాటను చిన్మయి ఆలపించింది. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం సమకూర్చాడు. మథురా ఎంటర్​టైన్మెంట్ బ్యానర్​పై శ్రీధర్ రెడ్డి, యాష్ రంగినేని నిర్మిస్తున్నారు. కేవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది చదవండి: ఇన్​స్టాగ్రామ్​లో ఖాతా తెరిచిన రామ్​చరణ్

ABOUT THE AUTHOR

...view details