తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్కడే ఆగిపోయే వ్యక్తిని నేను కాదు: కియారా

విజయాలు రాగానే అక్కడే ఆగిపోనని చెప్పిన నటి కియారా అద్వాణీ.. తనను తాను నిరూపించుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పింది. ఈమె నటించిన 'ఇందూ కీ జవానీ' సినిమా త్వరలో విడుదల కానుంది.

By

Published : Dec 25, 2020, 3:16 PM IST

kiyara
కియారా

కెరీర్​లో ఎన్ని హిట్లు వచ్చినా మరిన్ని విజయాలు కోసం తాను తహతహలాడుతూనే ఉంటానని హీరోయిన్​ కియారా అడ్వాణీ చెప్పింది. చాలు అని సరిపెట్టుకునే వ్యక్తిత్వం తనది కాదని స్పష్టం చేసింది. తనను తాను మెరుగుపరుచుకుని మరింత బాగా నటించేందుకు ప్రయత్నిస్తుంటానని తెలిపింది.

"మరిన్ని హిట్లు కొట్టాలనే తపనతో ఉంటాను. ఇంతటితో సంతృప్తి చెందాను అని అనుకునే వ్యక్తిని కాదు. నన్ను నేను నిరూపించుకోవడానికి ఎప్పుడూ కష్టపడుతుంటాను. ప్రస్తుతం ప్రయాణం సాఫీగానే సాగుతోంది. ఇలానే కొనసాగాలని అనుకుంటున్నాను"

-కియారా అడ్వాణీ, హీరోయిన్​

2014లో 'ఫగ్లీ' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది కియారా. ఆ తర్వాత 'ధోని: ది అన్​టోల్డ్​ స్టోరీ', 'కబీర్​ సింగ్'​, 'గుడ్​ న్యూజ్', 'గిల్టీ', 'లక్ష్మీబాంబ్​​' సహ పలు హిట్​ చిత్రాలు, వెబ్​సిరీస్​ల్లో నటించింది. త్వరలోనే 'ఇందూ కీ జవానీ'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి : డేటింగ్​ యాప్స్​లో ఎంట్రీపై కియారా క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details