తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2021, 11:17 AM IST

Updated : Apr 10, 2021, 11:37 AM IST

ETV Bharat / sitara

"ఆచార్య', 'విరాట పర్వం' చిత్రాలకు అనుమతి ఇవొద్దు!'

నక్సలిజాన్ని ప్రోత్సహించే చిత్రాలకు సెన్సార్​ అనుమతి ఇవ్వరాదంటూ తీవ్రవాద నిరోధక ఫోరం(ఏఎఫ్​టీ) బృందం డిమాండ్​ చేసింది. చిరంజీవి, రానా కొత్త చిత్రాలైన 'ఆచార్య', 'విరాట పర్వం' సినిమాల్లో మావోయిస్టు భావజాలాన్ని చూపించే అవకాశం ఉన్నందున.. ఆ సినిమాలకు అనుమతి ఇవ్వరాదంటూ సెన్సార్​ అధికారులకు బృందం విన్నవించుకుంది. లేని పక్షంలో సినిమాల ప్రదర్శనను నిలిపేస్తామంటూ ఆ సభ్యులు స్పష్టం చేశారు.

Do not issue censor certificates for Acharya and Virata Parvam Movies
"ఆచార్య', 'విరాట పర్వం' చిత్రాలకు అనుమతి ఇవొద్దు!'

ఛత్తీస్​గడ్​లోని ఇటీవలే సీఆర్​పీఎఫ్​ జవాన్లపై మావోయిస్టు బృందం దాడి చేసింది. దీని ఫలితంగా 22 మంది సీఆర్​పీఎఫ్​ సిబ్బంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మావోయిజం, నక్సలిజం లాంటి భావాజాలాలను ప్రోత్సహించే చిత్రాలను తెలుగు చిత్రసీమలో నిర్మిస్తున్నారని తీవ్రవాద నిరోధక ఫోరం (ఏఎఫ్​టీ) బృంద సభ్యులు అంటున్నారు. చిరంజీవి, రామ్​చరణ్​, రానా నటిస్తున్న 'ఆచార్య', 'విరాట పర్వం' సినిమాలు ఈ కోవకే చెందినవని వారు అభిప్రాయపడ్డారు.

తీవ్రవాద నిరోధక ఫోరం బృందం లేఖ

అయితే సమాజంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నక్సలిజం భావజాలాన్ని ప్రోత్సహించే చిత్రాలకు ధ్రువీకరణ పత్రం ఇవ్వొద్దని ఏఎఫ్​టీ బృందం సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ఫిల్మ్​ సెన్సార్​(సీబీఎఫ్​సీ)కి విన్నవించుకుంది. భవిష్యత్​లోనూ ఇలాంటి చిత్రాలకు సెన్సార్​ సర్టిఫికేట్​ జారీ చేయకూడదని ఆ సభ్యులు సూచించారు. యువతపై దుష్ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ఈ సినిమాల విడుదలకు తాము వ్యతిరేకమని వెల్లడించారు. ఒకవేళ ఆ చిత్రాలు థియేటర్లలో విడుదలైతే వాటిని అడ్డుకుంటామని ఏఎఫ్​టీ సభ్యులు తేల్చిచెప్పారు.

సెన్సార్​ అధికారిని కలిసిన తీవ్రవాద నిరోధక ఫోరం బృందం
తీవ్రవాద నిరోధక ఫోరం బృందం వివరణ

ఇదీ చూడండి:క్యాష్​ షోలో 'వకీల్​సాబ్​' టీమ్​ సందడి

Last Updated : Apr 10, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details