తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2019, 3:55 PM IST

Updated : Sep 30, 2019, 8:40 AM IST

ETV Bharat / sitara

జాన్​ సరసన హీరోయిన్​గా దివ్య ఖోస్లా​ రీఎంట్రీ

బాలీవుడ్​ దర్శకురాలు, నటి దివ్య ఖోస్లా.. హీరో జాన్​ అబ్రహం పక్కన త్వరలో కనిపించనుంది. పెళ్లి తర్వాత చాలా ఏళ్లు విరామం తీసుకున్న ఈ భామ... ఇప్పుడు 'సత్యమేవ జయతే 2'లో అవకాశం​ దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా కథానాయకుడు జాన్​ వెల్లడించాడు.

జాన్​ సరసన హీరోయిన్​గా దివ్య ఖోస్లా​ రీఎంట్రీ

గణేశుడి సన్నిధిలో జాన్​, దివ్యా

బాలీవుడ్​ ప్రముఖ హీరో జాన్​ అబ్రహం సరసన నటించేందుకు సిద్ధమవుతోంది నటి దివ్య ఖోస్లా​. యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతోన్న​ 'సత్యమేవ జయతే 2'లో సందడి చేయనుందీ భామ. ఇటీవలే గణపతి ఉత్సవాల్లో భాగంగా ముంబయిలోని వినాయకుడి ఆలయాన్ని సందర్శించిన వీరిద్దరూ.. సినిమాలో నటించే విషయంపై స్పష్టతనిచ్చారు.

టీ సిరీస్​ అధినేత భూషణ్​ కుమార్​ను2005లో వివాహమాడిన దివ్య ఖోస్లా... 2014లో 'యారియాన్'​తో దర్శకురాలిగా మారింది. అనంతరం 'సనమ్​రే' చిత్రాన్ని తెరకెక్కించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాతో హీరోయిన్​గా పునరాగమనం చేస్తోంది. 'సత్యమేవ జయతే' తొలి భాగం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులోని 'దిల్​బర్​ దిల్​బర్'​ పాట ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఇవీ చూడండి...

Last Updated : Sep 30, 2019, 8:40 AM IST

ABOUT THE AUTHOR

...view details