తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఏక్ విలన్'​ సీక్వెల్​లో హీరోయిన్​గా దిశా పటానీ! - Disha Patani in Ek Villain 2

బాలీవుడ్ హిట్​ 'ఏక్ విలన్​' సీక్వెల్​లో దిశా పటానీ హీరోయిన్​గా ఎంపికైందని సమాచారం. త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుంది.

'ఏక్ విలన్'​ సీక్వెల్​లో హీరోయిన్​గా దిశా పటానీ
హీరోయిన్​ దిశా పటానీ

By

Published : Mar 4, 2020, 1:29 PM IST

బాలీవుడ్​ హాట్ హీరోయిన్ దిశా పటానీ.. మరో యాక్షన్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిందట. 2014లో వచ్చిన 'ఏక్ విలన్' సీక్వెల్​గా మరో చిత్రాన్ని ప్రస్తుతం తీస్తున్నారు. ఇందులో కథానాయికగా దిశాను ఎంపిక చేసుకున్నారని టాక్. ఇటీవలే మాట్లాడిన దర్శకుడు మోహిత్​సూరి.. ఇదే విషయంపై పరోక్షంగా హింట్​ ఇచ్చాడు.

హీరోయిన్ దిశా పటానీ

"ఆమె నా సినిమాలో హీరో. హీరోలు ఎలాంటి యాక్షన్‌ సన్నివేశాలు చేస్తారో, అలాగే తానూ పోరాట సన్నివేశాల్లో నటిస్తానంది. 'మలాంగ్‌'కు కలిసి పనిచేసేటప్పుడు దిశా పటానీలోని నటనను దగ్గర్నుంచి గమనించా" -మోహిత్ సూరి, దర్శకుడు

'ఏక్ విలన్' సీక్వెల్​లో ఆదిత్యరాయ్ కపూర్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మాతృకను రూపొందించిన మోహిత్​నే దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు దిశా పటానీ.. సల్మాన్ ఖాన్ 'రాధే', టైగర్​ష్రాఫ్ 'బాఘీ 3'లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇది చదవండి:స్పెషల్: వెండితెర టైమ్‌ మిషన్స్‌ వచ్చేస్తున్నాయ్‌!

ABOUT THE AUTHOR

...view details