తెలంగాణ

telangana

'ఈ రోజుల్లో ఓటీటీలే చిత్రపరిశ్రమకు బాసట!'

By

Published : May 21, 2021, 9:42 PM IST

Updated : May 21, 2021, 11:13 PM IST

కరోనా సంక్షోభంలో ఓటీటీలు చిత్రపరిశ్రమను నడిపిస్తున్నాయని అభిప్రాయపడింది బాలీవుడ్​ నటి దిశా పటానీ. దీనితో పాటు ఎంతోమందికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధి కల్పిస్తున్నాయని వెల్లడించింది.

Disha Patani Thanking to OTT Medium in pandemic
'ఈ రోజుల్లో ఓటీటీలే చిత్రపరిశ్రమకు బాసట!'

ప్ర‌స్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఓటీటీలు న‌డిపిస్తున్నాయని, చాలామందికి ఉపాధి అందిస్తున్నాయని బాలీవుడ్ న‌టి దిశా ప‌టానీ అన్నారు. స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ఆమె న‌టించిన 'రాధే:యువ‌ర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' చిత్రం ఇటీవ‌ల ఓటీటీ జీ ప్లెక్స్‌లో విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా డిజిట‌ల్ మాధ్య‌మం గురించి ఆమె త‌న అభిప్రాయం తెలియ‌జేశారు.

"సాధార‌ణ రోజుల్లో సినిమాలు ఎంత గ్రాండ్‌గా విడుద‌ల‌వుతాయో.. అలా రాధే విడుద‌ల కోసం ఎదురు చూస్తున్నాను. ఎంతో క‌ష్ట‌ప‌డి న‌టించిన‌ చిత్రాన్ని ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లి.. పండ‌గ‌లాంటి వాతావ‌ర‌ణం మధ్య విడుద‌లైతే ఆ సంతృప్తే వేరు. అయినా ఇలాంటి క‌ష్ట‌త‌ర‌మైన రోజుల్లో సినిమా విడుద‌ల కావ‌డ‌మే గొప్ప విష‌యం. ఎప్పుడేం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటప్పుడు ఓటీటీ మంచి వేదిక‌గా నిలుస్తోంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌ను న‌డిపించే ఓ మార్గంగా క‌నిపిస్తోంది. ఎంద‌రికో ఉపాధిని కల్పిస్తోంది. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వెళ్లి సినిమాలు చూసేందుకు వెన‌క‌డుగు వేస్తున్నారు. ఇంట్లోనే సుర‌క్షితంగా ఉంటూ ఓటీటీ ద్వారా వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు డిజిట‌ల్ మాధ్య‌మం సేవ‌ల‌కు ధ‌న్య‌వాదాలు."

- దిశా పటానీ, బాలీవుడ్​ నటి

'లోఫర్‌'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీ.. మహేశ్​ హీరోగా త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో అవకాశం కొట్టేసిందని సమాచారం. ఆ తర్వాత అల్లు అర్జున్‌ నటించిన పలు సినిమాల విషయంలోనూ ఆమె పేరు ప్రస్తావన కొచ్చింది కానీ కుదర్లేదు. ఇప్పుడు మహేశ్​కు జోడీగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి..'ఆర్​ఆర్​ఆర్​' డిజిటల్​ హక్కులకు రూ.325 కోట్లు!

Last Updated : May 21, 2021, 11:13 PM IST

ABOUT THE AUTHOR

...view details