తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2019, 5:42 PM IST

ETV Bharat / sitara

ఒక్క ఫ్లాప్​తో కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయిన పారితోషికం..!

తమిళ్​లో ధనుష్​ హీరోగా తెరకెక్కిన 'అసురన్'​ సినిమాను తెలుగు రీమేక్​ చేయనున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్​ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీకి దర్శకత్వం వహించనున్న శ్రీకాంత్​ అడ్డాలకు పారితోషికం విషయంలో పెద్ద షాక్​ తగిలిందట. ఇంతకీ ఏం జరిగింది?

director sreekanth addala remuneration has came from crores to lakhs
ఒక్క ప్లాఫ్​తో కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయిన పారితోషకం..!

'కొత్తబంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ముకుంద' వంటి చిత్రాలతో హ్యాట్రిక్​ హిట్లను సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్​ అడ్డాల. ఆ తర్వాత తీసిన 'బ్రహ్మోత్సవం' సినిమా ఆయనకు పెద్ద షాక్​ ఇచ్చింది. ఈ ఒక్క చిత్ర ఫలితంతో వరుస విజయలందుకున్న శ్రీకాంత్​.. మళ్లీ సినిమా చేజిక్కించుకోవడానికి మూడేళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం 'అసురన్'​ తెలుగు రీమేక్​కు శ్రీకాంత్​ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్​ హీరోగా నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది.

తాజాగాఈ సినిమాకు శ్రీకాంత్​ అందుకోబోతున్న పారితోషికానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ మూవీని తెరకెక్కించేందుకు శ్రీకాంత్​కు నెలకు రూ.2 నుంచి 3 లక్షల మధ్య పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. సురేష్​ ప్రొడక్షన్స్​ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర మాతృకను దర్శకుడు వెట్రి మారన్​ కేవలం రెండు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాడు. తెలుగు వర్షెన్​ కూడా ఇంచుమించు ఇదే వేగంతో పూర్తి చేయాలని నిర్మాత సురేష్​బాబు నిర్దేశించాడట. ఇదంతా చూస్తుంటే దర్శకుడిగా శ్రీకాంత్​కు కేవలం రూ.10 లక్షల్లోపే పారితోషికం ముట్టబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తర్వాత మంచి ఫలితం వస్తే.. లాభాల్లోఆయనకిఎంతో కొంత వాటా ఇస్తానని సురేష్​ ప్రొడక్షన్స్​ మాటిచ్చినట్లు సమాచారం. ఏదేమైనా ఒక్క సినిమాతో శ్రీకాంత్​.. కోట్ల పారితోషికం లక్షల్లోకి పడిపోయిందనేది తెలుస్తోంది.

ఇవీ చూడండి.. వెండితెరపై​ శభాష్​ 'మిథాలీ'​​... నటి ఎవరో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details