తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దిశ' హత్యాచార ఘటనపై ఆర్జీవీ సినిమా

దర్శకుడు రామ్​గోపాల్ వర్మ.. 'దిశ' ఘటన ఆధారంగా సినిమా తీయనున్నట్లు ప్రకటించాడు. ఇందులో భయంకర నిజాలు చూపించబోతున్నట్లు పేర్కొన్నాడు.

By

Published : Feb 1, 2020, 2:53 PM IST

Updated : Feb 28, 2020, 6:48 PM IST

'దిశ' హత్యాచార ఘటనపై ఆర్జీవీ సినిమా
దర్శకుడు రామ్​గోపాల్ వర్మ

కాంట్రవర్సీలు, జీవిత కథలు తీయడంలో ముందుండే దర్శకుడు రామ్​గోపాల్ వర్మ.. మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' అత్యాచారం, హత్య సంఘటనల ఆధారంగా ఓ చిత్రం తీయనున్నాడు. దీనికి 'దిశ' అనే టైటిల్​ ఖరారు చేసినట్లు చెబుతూ వరుస ట్వీట్స్ చేశాడు.

ఇందులో చాలా భయంకర నిజాలు చెప్పబోతున్నట్లు వర్మ తన ట్వీట్స్​లో రాసుకొచ్చాడు. రేప్ చేయాలనుకున్న వారు, భయంతో వణికిపోయేలా తన చిత్రంలో సన్నివేశాలు ఉంటాయన్నాడు. త్వరలోనే ఈ సినిమా మొదలు కానుందని పేర్కొన్నాడు.

Last Updated : Feb 28, 2020, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details