తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి చిత్రానికి దిల్​రాజు మద్దతు - shravya verma

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న ఓ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్​రాజు సమర్పకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలిపింది.

సినిమా

By

Published : Jul 15, 2019, 10:01 PM IST

Updated : Jul 15, 2019, 10:59 PM IST

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయనుంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్​రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు నిర్మాతలు.

సినిమాకుదిల్​రాజు మద్దతివ్వడం పట్ల ఆ చిత్ర నిర్మాతలు సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంతోషం వ్యక్తం చేశారు. మొదటిసారి తమ నిర్మాణ సంస్థలో రూపొందుతున్న చిత్రానికి ఇంతకంటే మంచి ఆరంభం దక్కదని.. దిల్​రాజుతో పని చేయడం ఆనందంగా ఉందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇవీ చూడండి.. నాగ్​ ఫ్రస్ట్రేషన్​తో రకుల్ నవ్వుల్​ నవ్వుల్​

Last Updated : Jul 15, 2019, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details