బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ముఖ్యపాత్ర పోషించి, నిర్మించిన చిత్రం 'ఛపాక్'. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ వ్యవహారం అంత సాఫీగా సాగేలా కనపడటం లేదు. అపర్ణా భట్ అనే న్యాయవాది చిత్ర విడుదలను ఆపాలంటూ దిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు.
"నేను చాలా సంత్సరాలుగా యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ న్యాయవాదిని. కానీ ఈ సినిమాలో నాకు తగిన గుర్తింపునివ్వలేదు. సినిమా చూశాక నిరాశకు గురయ్యా. ఈ విషయంలో బాలీవుడ్ నిశ్శబ్దంగా ఉండటం విచారకరం. రానున్న పరిణామాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం" -అపర్ణా భట్, న్యాయవాది