తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పెళ్లి అయ్యాక  పిల్లలేనా... ఇంక మారరా..?'

పెళ్లైన వెంటనే పిల్లలు ఎప్పుడంటూ మహిళలపై ఒత్తిడి తేవడం మంచిది కాదంటూ వ్యాఖ్యనించింది బాలీవుడ్ హీరోయిన్​ దీపికా పదుకొనే . ఇలాంటి విషయాల్లో స్త్రీలను ఇబ్బంది పెట్టకూడదని అభిప్రాయపడింది.

By

Published : Apr 13, 2019, 11:51 AM IST

'పెళ్లి అయ్యాక  పిల్లలేనా...ఇంక మారరా..?'

మహిళల సమస్యలు, హక్కులు, సమానత్వంపై ఎప్పడూ మాట్లాడే బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొనే... స్త్రీలు ఎదుర్కొనే మరో సమస్యపై గళమెత్తింది. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత పిల్లలకు జన్మనివ్వడం.. ఇలా ప్రతి విషయంలోనూ మహిళలపై ఒత్తిడి చేయటం సరైంది కాదంటూ వ్యాఖ్యానించింది.

గతేడాది నవంబరు 15న దీపిక, రణ్​వీర్​ సింగ్​​ల వివాహమైంది. పెళ్లి తర్వాత పిల్లలు ఎప్పుడంటూ దీపికకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై దీపికా స్పందించింది.

'పెళ్లైన వెంటనే పిల్లలు ఎప్పుడంటూ మహిళలను ఇబ్బంది పెడుతుంటారు. ప్రతి స్త్రీ ఈ సమస్య ఎదుర్కొంటోంది. అయినా ఇలా భార్యాభర్తలపై ఒత్తిడి తేవడం మంచిది కాదు. ఎప్పుడైతే ఇలాంటి విషయాల్లో మహిళలను ఇబ్బందిపెట్టడం మానేస్తారో అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది' అంటూ దీపిక ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చింది.

దీపికా ప్రస్తుతం ఛపాక్​ అనే చిత్రంలో నటిస్తోంది. లక్ష్మీ అగర్వాల్​ అనే యాసిడ్​ బాధితురాలి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తరవాత దీపిక హాలీవుడ్​ హీరో విన్​ డీజిల్​తో కలిసి 'ట్రిపుల్ ఎక్స్​ 4' చిత్రంలో నటించనుంది.

ABOUT THE AUTHOR

...view details