తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2020, 11:40 AM IST

Updated : Nov 6, 2020, 2:11 PM IST

ETV Bharat / sitara

ఆ థియేటర్​లో మళ్లీ 'డీడీఎల్​జే'.. హిమాలయాలకు నాగ్ ప్యాకప్

బాలీవుడ్​ హిట్ పెయిర్ షారుక్, కాజోల్​ నటించిన 'డీడీఎల్​జే'.. ప్రఖ్యాత మారాఠా మందిర్​లో మళ్లీ కనువిందు చేయనుంది. 'వైల్డ్​డాగ్' చిత్రీకరణ పూర్తి చేసుకున్న నాగ్.. హిమాలయాలకు ప్యాకప్ చెప్పేశారు.

DDLJ BACK IN CINEMAS, NAGARJUNA COMPLETES 'WILD DOG' SHOOT
థియేటర్లలో మళ్లీ డీడీఎల్​జే.. హిమాలయాలకు నాగ్ ప్యాకప్

బాలీవుడ్​ క్లాసిక్ హిట్ 'దిల్​వాలే దుల్హానియా లే జాయేంగే' సినిమా థియేటర్​లో మరోసారి ప్రదర్శించనున్నారు. మహారాష్ట్రలో గురువారం(నవంబరు 5) నుంచి సినిమా హాళ్లు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకుల్ని 'డీడీఎల్​జే' అలరించనుంది.

'దిల్​వాలే దుల్హానియా లే జాయేంగే' సినిమాలో షారుక్- కాజోల్

ప్రఖ్యాత మరాఠా మందిర్​లో శుక్రవారం నుంచి ప్రతిరోజూ షోలు వేయనున్నారు. ఇదే థియేటర్​లో గతంలో డీడీఎల్​జే విడుదలైనప్పటి నుంచి నిరంతరాయంగా ఆడుతూనే ఉంది. లాక్​డౌన్ కారణంగా అది నిలిచిపోయి, మళ్లీ ఇప్పుడు తిరిగి మొదలైంది.

హిమాలయాలకు నాగార్జున గుడ్​బై

'వైల్డ్​డాగ్' చిత్రీకరణలో భాగంగా హిమాలయాల్లో ఉన్న హీరో నాగార్జున.. తన పాత్రకు సంబంధించిన షూటింగ్​ను పూర్తిచేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని విడుదల చేశారు. ఇందులో ఎన్​ఐఏ అధికారి విజయ్ వర్మగా నాగ్ కనిపించనున్నారు. అహిషోర్ సోలమన్ దర్శకుడు.

చిత్రబృందంతో నాగార్జున

ట్రైలర్​తో 'రేడియో మాధవ్'

మలయాళ నటుడు జయరామ్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, పూర్ణ కలిసి నటించిన 'మార్కోని మతాయ్' సినిమా.. తెలుగులో 'రేడియో మాధవ్'గా రానుంది. ట్రైలర్​ను శుక్రవారం విడుదల చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 6, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details