తెలంగాణ

telangana

అగ్రహీరోలు.. క్రేజీ మల్టీస్టారర్లు.. సందడే సందడి

By

Published : Dec 25, 2020, 9:00 AM IST

ఇటీవల కాలంలో తెలుగులో పలు క్రేజీ మల్టీస్టారర్లు తెరకెక్కుతున్నాయి. వాటిలో అగ్రహీరోలు నటిస్తుండటం వల్ల అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? వాటి సంగతేంటి?

CRAZY MULTISTARRERS IN TOLLYWOOD
అగ్రహీరోలు.. క్రేజీ మల్టీస్టారర్లు

తెరపై ఒక్క హీరో కనిపిస్తేనే గోల చేసి, ఈలలు వేసి హంగామా చేస్తారు అభిమానులు. అలాంటిది అతడితో పాటు మరో కథానాయకుడు కలిసి నటిస్తే ఇంకేమైనా ఉందా? ఫ్యాన్స్ ఆనందానికి అంతే లేకుండా పోతుంది. టాలీవుడ్​కు మల్టీస్టారర్​లు కొత్త కాకపోయినప్పటికీ ఇటీవల కాలంలో తీస్తున్న కొన్ని సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎప్పుడెప్పుడూ ఆ సినిమాల్ని చూస్తామా అనే ఆత్రుతను కలిగిస్తున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? అందులో నటిస్తున్న వారెవరు?

చిరుతో చరణ్

లాక్​డౌన్ అనంతరం ఇటీవల మొదలైన 'ఆచార్య' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు కొరటాల శివ.. సినిమాలో రామ్​చరణ్​ది అతిథి పాత్ర కాదని స్పష్టం చేశారు. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'ఆచార్య'. వీరిద్దరూ పూర్తి స్థాయిలో ఓ చిత్రం చేయడం ఇదే మొదటిసారి కావడం వల్ల సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రామ్​చరణ్​తో చిరంజీవి

బాలయ్యతో శౌర్య

బోయపాటి శ్రీనుతో మూడోసారి కలిసి పనిచేస్తున్న నందమూరి బాలకృష్ణ.. తర్వాతి ఓ యువ దర్శకుడి తీస్తున్న సినిమాలో నటిస్తారు. ఇందులో యంగ్ హీరో నాగశౌర్య కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ త్వరలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది.

నందమూరి బాలకృష్ణ

పవన్​తో రానా

తన అన్ని సినిమాల్లో సింగిల్​ హీరోగా నటించిన పవర్​స్టార్ పవన్​ కల్యాణ్.. తొలిసారి మరో కథానాయకుడితో కలిసి స్క్రీన్ షేర్​ చేసుకోనున్నారు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్​లో రానాతో కలిసి సందడి చేయనున్నారు. ఇటీవల ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో పవన్​ పోలీస్​గా, రానా రిటైర్డ్ మిలటరీ అధికారిగా కనిపించనున్నారు. దీంతో అప్పుడే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

రానా పవన్ కలిసి కొత్త సినిమా

సిద్ధార్థ్​తో శర్వానంద్

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత నేరుగా ఓ తెలుగు సినిమాలో సిద్ధార్థ్ నటిస్తున్నారు. 'మహాసముద్రం' టైటిల్​తో తీస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ మరో కథానాయకుడు. అమరమైన ప్రేమకథ అంటూ ఇప్పటికే చెప్పిన చిత్రబృందం అంచనాల్ని పెంచేసింది. అందుకే సినిమా ఎలా ఉండనుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోంది.

మహాసముద్రం సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్
సిద్ధార్థ్

'ఎఫ్​3'లో రవితేజ?

'ఎఫ్2'కు సీక్వెల్​గా తీస్తున్న 'ఎఫ్​3'లో వెంకటేశ్, వరుణ్ తేజ్​తో పాటు మరో హీరో కూడా నటించనున్నారు. అయితే అది ఎవరనేది ఇంతవరకు వెల్లడించలేదు. దీంతో రవితేజనే మూడో కథానాయకుడిగా చేస్తారంటూ వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి.

సునీల్​ను​ కూడా ఆ పాత్ర కోసం పరిశీలిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి ఎంత నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. బుధవారమే(డిసెంబరు 23) షూటింగ్ ప్రారంభించగా, వెంకటేశ్ పాల్గొన్నారు.

ఎఫ్​3 సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్

ABOUT THE AUTHOR

...view details