తెలంగాణ

telangana

By

Published : Oct 1, 2020, 4:23 PM IST

ETV Bharat / sitara

థియేటర్లలో విడుదలయ్యే మొదటి సినిమా ఆర్జీవీదే!

లాక్​డౌన్ తర్వాత థియేటర్లు ప్రారంభించుకోవడానికి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు కొంతమంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. అయితే ఇలా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందో లేదో దర్శకుడు రామ్​గోపాల్ వర్మ తన సినిమా విడుదల తేదీని ప్రకటించాడు.

Corona Virus will be 1st film to release after LOCKDOWN is lifted on movie theatres says RGV
లాక్​డౌన్ తర్వాత విడుదలయ్యే మొదటి సినిమా ఆర్జీవీదే!

అన్‌లాక్‌-5 మార్గదర్శకాల్లో భాగంగా అక్టోబర్‌ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను ప్రారంభించడానికి కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలో థియేటర్లు ప్రారంభం కాగానే మొదటి చిత్రంగా తాను నిర్మించిన 'కరోనా వైరస్‌' విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపాడు.

"ఎట్టకేలకు అక్టోబర్‌ 15వ తేదీ నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌ అవుతున్నాయి. సంతోషంగా ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత విడుదల చేయనున్న మొదటి చిత్రంగా 'కరోనా వైరస్‌' నిలుస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఒక కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందనేది చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. లాక్‌డౌన్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేశాం."

-ఆర్జీవీ, దర్శకుడు

శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి అగస్త్య మంజూ దర్శకత్వం వహించాడు. కంపెనీ క్రియేషన్స్‌ పతాకంపై రామ్‌గోపాల్‌ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ABOUT THE AUTHOR

...view details