తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2021, 10:43 AM IST

ETV Bharat / sitara

'ఆచార్య', 'థాంక్యూ' సినిమాలపై కరోనా ఎఫెక్ట్!

కొవిడ్ ప్రభావంతో 'ఆచార్య' షూటింగ్​ ఆపేయగా, 'థాంక్యూ' విదేశీ షెడ్యూల్​ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైరస్​ బారిన పవన్​, సోనూసూద్ తదితరులు స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

corona effect on 'Acharya', 'Thank you'
'ఆచార్య', 'థాంక్యూ' సినిమాలపై కరోనా ఎఫెక్ట్!

కరోనా సెకండ్ వేవ్​ వల్ల ప్రజలతో పాటు టాలీవుడ్​ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు నటులు, దర్శక, నిర్మాతలు కరోనా బారిన పడటం వల్ల షూటింగ్​లు​ నిలిచిపోతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి 'ఆచార్య', 'థాంక్యూ' సినిమాలు చేరాయి.

ప్రముఖ నటుడు సోనూసూద్​కు ఇటీవల కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయంతో పాటు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 'ఆచార్య' చిత్రీకరణను కొన్నాళ్లు వాయిదా వేయాలని నిర్మాత రామ్​చరణ్ భావించారట. అందుకే ప్రస్తుతం హైదరాబాద్​లో జరుగుతున్న షెడ్యూల్​ను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నాగచైతన్య 'థాంక్యూ' టీమ్.. 15 రోజుల షెడ్యూల్​ కోసం త్వరలో ఇటలీ వెళ్లాలి. కానీ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా దానిని వాయిదా వేసినట్లు సమాచారం. ఎప్పుడు వెళ్లేది త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు. ఇందులో రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికాగోర్ హీరోయిన్లు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details