తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగనకు షాక్- 'మణికర్ణిక' సీక్వెల్​పై ఆరోపణలు - మణికర్ణకపై ఆరోపణలు

ప్రముఖ నటి కంగనా రనౌత్.. 'మణికర్ణిక' సీక్వెల్ కథ విషయంలో వివాదంలో ఇరుక్కుంది. ఈ కథ తాను రాస్తున్న పుస్తకం నుంచి దొంగిలించారని రచయిత అశిష్ కౌల్ ఆమెపై ఆరోపణలు చేశారు.

kangana controversy alert
కంగనకు షాక్- మణికర్ణిక సీక్వెల్​పై ఆరోపణలు

By

Published : Jan 15, 2021, 4:17 PM IST

గత కొన్ని నెలల నుంచి వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఇప్పుడు​ మరో వివాదంలో చిక్కుకుంది. 'మణికర్ణిక' సీక్వెల్​లో నటించనున్నట్లు ఈమె ఇటీవల ప్రకటించింది. అయితే ఈ సినిమా కథ తన దగ్గరి నుంచి తస్కరించిందేనని రచయిత అశిష్ కౌల్ ఆరోపణలు చేశారు. ట్వీట్ కూడా చేశారు.

"నా కథను కంగన దొంగిలించింది. సమాజంలో నిజం కోసం పాటుపడే తాను.. ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉంది. దీన్ని శ్రమ దోపిడీగా పరిగణిస్తాను. హక్కుల కోసం పోరాడే కంగన నాలాంటి రచయిత హక్కులను భంగపరచడం ఎంతవరకు సమంజసం. ఆమె ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు"

-అశిష్ కౌల్, రచయిత

'దిద్దా: ద వారియర్​ క్వీన్ ఆఫ్ కశ్మీర్' పేరుతో రాస్తున్న హిందీ పుస్తకానికి ముందుమాట రాయమని రచయిత అశిష్​ కౌల్ కంగనాను కోరారు. ఈ నేపథ్యంలో జనవరి 14న కొత్త సినిమా ప్రస్తావన తీసుకొచ్చింది కంగన. అయితే ఈ కథ తన పుస్తకంలోనిదే అని భావించిన అశిష్​.. ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు.​

ఇదీ చదవండి:కంగన 'మణికర్ణిక' సీక్వెల్​.. సినిమాకు భారీ బడ్జెట్‌

ABOUT THE AUTHOR

...view details