తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లిరోజుకు మరో 3 రోజులు.. అంతలోనే విడాకులు - movie heroin diverse news latest

నటి శ్వేతాబసు ప్రసాద్ తన భర్తతో విడాకులు తీసుకోనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది.

cinima actress swetha basu diversed with her husband
3రోజుల్లో పెళ్లిరోజు.. అంతలోనే విడాకులు!

By

Published : Dec 10, 2019, 3:26 PM IST

Updated : Dec 10, 2019, 3:49 PM IST

'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు సినీ ప్రియుల మనసు దోచిన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్​. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నా.. ఆ తర్వాత అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత కొన్ని అనుకోని వివాదాల్లో చిక్కుకొని, సినీ కెరీర్​కు దూరమైంది. గతేడాది ఈ అమ్మడు రోహిత్‌ మిట్టల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. గతేడాది డిసెంబరు 13న పుణెలో ఘనంగా ఒక్కటైన ఈ జంట.. మరో మూడు రోజుల్లో పెళ్లిరోజు జరుపుకోనుంది. ఏడాదైన పూర్తి కాకుండానే విడాకులు తీసుకోనుందుకు సిద్ధమైందీ జంట. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ శ్వేతాబసు తన ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేసింది.

"రోహిత్‌, నేను ఇద్దరం ఓ నిర్ణయానికి వచ్చే మా వివాహ బంధానికి ఇక్కడితో ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాం. గత కొద్దినెలలుగా చర్చించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది కాలంలో నాకెన్నో మధుర జ్ఞాపకాలను అందించిన రోహిత్‌కు ధన్యవాదాలు"

-శ్వేతా బసు ప్రసాద్​, సినీ నటి

మరో మూడు రోజుల్లో పెళ్లిరోజు జరుపుకోవాల్సిన ఈ జంట.. ఇలా అనూహ్యంగా విడాకుల నిర్ణయంతో వార్తల్లోకెక్కడం చర్చనీయాంశమైంది.

Last Updated : Dec 10, 2019, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details