శ్రీలంకలో వరుస బాంబు దాడులు జరిగాయి. అనేక మంది చనిపోయారు. ఈ ఘటనపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, శేఖర్ కపూర్, వివేక్ ఆనంద్ ఓబెరాయ్, ప్రకాశ్రాజ్ దాడిని తీవ్రంగా ఖండించారు.
' ఇది చాలా బాధాకరం. ఒక్కటి జరిగితే తట్టుకోవడం కష్టం అలాంటిది వరుస దాడులు జరగడాన్ని అసలు ఊహించలేకపోతున్నాం. ఇది ఆపాల్సిందే'
- జాక్వెలిన్ ఫెర్నాండేజ్, బాలీవుడ్ నటి
'పక్కా ప్రణాళికతో ఈస్టర్ రోజున దాడి చేశారు. ఉగ్రవాదం ప్రపంచానికే పెద్ద శత్రువు. ఇది ఉన్నంతవరకు ఎవరూ భద్రంగా బతకలేరు'
- శేఖర్ కపూర్, దర్శకుడు
' ఇలాంటి పవిత్రదినాన ఇంత పెద్ద స్థాయిలో ఉగ్రదాడి గురించి విని షాకయ్యా'
-అర్జున్ కపూర్, నటుడు
'ఇది చాలా బాధాకరమైన రోజు. ప్రశాంతత కోసం చర్చికు వెళ్లిన వారిపై దాడి జరగడం నిజంగా భయానకం. ప్రపంచంలో ఏం జరుగుతోంది?'
- హూమా ఖురేషీ, నటుడు
' ఈ ఉగ్రదాడి నిజంగా సిగ్గు చేటు. చాలా మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అందరూ ప్రార్థించాలని కోరుతున్నా'
-మధుకర్ బండార్కర్, దర్శకుడు
'ప్రార్థనలో ఉన్న ప్రజలపై శ్రీలంకలో దాడి జరిగింది. ఇది అసహ్యమైన పని. ఉగ్రవాదులు చేసే పనుల వల్ల మానవత్వం మంటగలిసిపోతుంది. ఎవరైతే ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారో వారి పట్ల జాగ్రత్తగా ఉండండి.
- ప్రకాశ్రాజ్, నటుడు
నటీనటులు వివేక్ ఆనంద్ ఒబెరాయ్, బొమన్ ఇరానీ, సోహన్ అలీఖాన్, సిద్దార్థ్ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.