తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నేను రాసిన కవితలు చదివితే నాకే నవ్వొస్తుంది'

నటి తమన్నా భాటియా తన చిన్నతనంలోని జ్ఞాపకాలను తాజాగా గుర్తు తెచ్చుకున్నారు. తన డైరీలో "నేను చాలా అయోమయంలో ఉన్నా" అనే వాక్యాన్ని ఎక్కువగా రాస్తానని వెల్లడించారు.

CHITCHAT WITH TAMANNA BHATIYA
'నేను రాసిన కవితలు చదివితే నాకే నవ్వొస్తుంది'

By

Published : May 24, 2020, 9:31 AM IST

హీరోయిన్ తమన్నా భాటియాలో ఓ కవయిత్రి దాగుందని తన ఇన్​స్టాగ్రామ్​ వాల్​పై రాసుకున్నారు. ఈ క్రమంలో లాక్​డౌన్​ సమయంలో కొన్ని కవితలు రాసినట్లు వెల్లడించారు. చిన్నతనంలో కవితలు ఎక్కువగా రాసే వారని ఆమె చెప్పుకొచ్చారు. ​

"కొన్నిసార్లు కవయిత్రిని కూడా" అని మీ ఇన్‌స్టాగ్రామ్‌ వాల్‌పై రాసుకున్నారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఏమైనా కవితలు రాశారా?

తమన్నా:మనసుకు ఆహ్లాదంగా అనిపించినప్పుడల్లా కవితలు రాస్తుంటా. ఈ లాక్‌డౌన్‌ విరామంలోనూ కొన్ని కవితలు రాశా. దాని కన్నా ఎక్కువగా నా చిన్నతనంలో రాసుకున్న పాత కవితల్ని తిరిగి చదువుకుంటున్నా. కొన్నింటిని చదువుతుంటే.. ఆ సమయంలో ఎందుకిలా రాశా? ఇది కూడా కవితేనా? అని నవ్వొస్తుంది. మీకొక విషయం చెప్పనా చిన్నతనంలో నేనెక్కువగా డైరీలో రాసుకున్న మాటేంటో తెలుసా? "నేను చాలా అయోమయంలో ఉన్నా".

ఇదీ చూడండి... ఆది కొత్త సినిమాకు 'బ్లాక్​' టైటిల్​ ఖరారు

ABOUT THE AUTHOR

...view details