తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా కరోనా ప్లాస్మా

పేద కరోనా బాధితుల కోసం చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ గొప్ప నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కరోనా బాధితులకు ఉచితంగా కొవిడ్ ప్లాస్మా సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది.

By

Published : Sep 29, 2020, 11:00 PM IST

Chiranjeevi Eye and Blood Bank supplies plasma free for poor patients
చిరు బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా ప్లాస్మా

చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ పేద రోగులకు ఉచితంగా కొవిడ్‌-ప్లాస్మా అందిస్తోంది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కరోనా బాధితులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

"పచ్చటి జీవితాలపై కర్కశ కరోనా పంజా విసురుతూ చిన్నాభిన్నం చేస్తోంది. పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ప్లాస్మా వితరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం."

-చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రకటన

"తెల్ల రేషన్‌ కార్డుదారులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఉచితంగా ప్లాస్మా సరఫరా చేస్తోంది. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. కరోనా సోకి రోగ విముక్తులైన వారు ప్లాస్మాదానం చేస్తే మరికొంత మందికి ఆయుష్షు పోసినట్టే. 22 సంవత్సరాలుగా మెగాస్టార్‌ చిరంజీవి సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా రక్త నిధులు అందించారు. ఈ సందర్భంగా ఆ విషయాన్ని తెలియజేయడం సంతోషంగా ఉంది" అని సంస్థ సీఈవో ప్రకటన విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details