మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం 'ఆచార్య'. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఇందులో చిరుతో పాటు రామ్చరణ్ నటించనున్నాడనే వార్తలు వచ్చాయి. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు మెగాస్టార్.
"ఆచార్య'లో చరణ్కు ఓ పాత్ర ఉన్నది వాస్తవమే. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇందులో నటించడం వీలు పడుతుందో? లేదో? ఇప్పుడే చెప్పలేను. చెర్రీతో ఈ పాత్ర చేయించేందుకు, దర్శకుడు రాజమౌళిని ఒప్పించా. ఓ నెల పాటు చెర్రీని షూటింగ్ నుంచి ఇవ్వమని కోరా. అందుకు ఆయన అంగీకరించారు. ఈ చిత్రంలో నేను, చరణ్.. తండ్రి కొడుకులుగా కనిపించట్లేదు. అంతకు మించిన గురు శిష్యుల బంధం మాది" -మెగాస్టార్ చిరంజీవి, కథానాయకుడు