తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జనతా కర్ఫ్యూకు కమల్​, చిరు మద్దతు - జనతా కర్ఫ్యూకు కమల్​,చిరు మద్దతు

ప్రధానమంత్రి మోదీ పిలుపునకు మద్దతు ప్రకటించారు కథానాయకులు చిరంజీవి, కమల్​హాసన్​. పెనువిపత్తు నుంచి కాపాడుకోవడానికి ప్రజలందరూ సమైక్యతతో ఇంట్లో సురక్షితంగా ఉండాలని సూచించారు.

Chiranjeevi and Kamalhassan supports Janata curfew
జనతా కర్ఫ్యూకు కమల్​,చిరు మద్దతు

By

Published : Mar 21, 2020, 10:45 AM IST

ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు నటుడు, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌, మెగాస్టార్​ చిరంజీవి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కమల్​ ట్వీట్‌ చేయగా.. చిరు ఓ వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

" ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అసాధారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పెనువిపత్తు నుంచి కాపాడుకోవడానికి సమైక్యతతో ఇంట్లో సురక్షితంగా ఉందాం. దీనికి మద్దతు ఇవ్వాలంటూ నా అభిమానులు, మిత్రులను కోరుతున్నాను."

-కమల్​హాసన్​, కథానాయకుడు.

ఈ ట్వీట్‌ను విజయ్‌, అజిత్‌, రజనీకాంత్‌, సూర్య, ధనుష్‌, విజయ్‌ సేతుపతి, శింబు తదితర తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల ట్విట్టర్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేశాడు కమల్.

కరోనాను నియంత్రించడానికి క్షేత్రస్థాయిలో అహర్నిశలు స్నేహాభావంతో 24గంటలు పనిచేస్తోన్న వైద్యబృందానికి, స్వచ్ఛ కార్యక్రమానికి, పోలీసు శాఖవారికి, ఆయా ప్రభుత్వాలకు హర్షాతిరేకలు ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయం ఇదని తెలిపాడు చిరంజీవి.

"భారతీయులుగా మనమందరం ఒకటిగా నిలబడి ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం తెలుపుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం."

-చిరంజీవి, కథానాయకుడు.

ఈనెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మంత్రి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి : మరోసారి వెండితెరపై 'ఖైదీ 150' కాంబో

ABOUT THE AUTHOR

...view details