వినోదమంటే కొన్నాళ్ల క్రితం వరకు అందరి కళ్లూ థియేటర్ల వైపే చూసేవి. ఇప్పుడీ వెండితెర వినోదాలకు ఓటీటీ వేదికలు, డిజిటల్ మాధ్యమాలు మంచి ప్రత్యామ్నాయాలుగా మారాయి. కరోనా పరిస్థితుల తర్వాత పెద్ద చిత్రాలు సైతం ఓటీటీ బాట పట్టడం వల్ల.. ఈ వేదికలకు ఆదరణ మరింత పెరిగింది. ఈ ఆదరణ ఎంత ఉన్నా.. అదే స్థాయిలో విమర్శలూ ఉన్నాయి. ఈ వేదికల కోసం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ, దీంట్లో ప్రసారమయ్యే వెబ్ కంటెంట్కు సెన్సార్ లేకపోవడం వల్ల.. అశ్లీల కంటెంట్కు ఓటీటీలు నిలయాలుగా మారాయనేది పలువురి వాదన. ఈ నేపథ్యంలోనే ఈ డిజిటల్ వేదికల్ని నియంత్రించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. డిజిటల్ మీడియా మొత్తాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో.. త్వరలో ఓటీటీ కంటెంట్కూ సెన్సార్ కత్తెర తప్పదని అర్థమవుతోంది. ఇదే జరిగితే.. ఇకపై ఈ సంస్థలన్నీ సెన్సార్ చేసిన కంటెంట్నే కొనుక్కోవాల్సి వస్తుంది.
అయితే, వీటిపై నియంత్రణ ఎలా ఉంటుంది? నిర్దిష్ట మార్గదర్శకాలు ఉంటాయా? ప్రత్యేక సంస్థ ఏర్పాటు ఉంటుందా? అన్నది స్పష్టత ఇవ్వలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఇప్పటికే చాలా మంది నిర్మాతలు, దర్శకులు, రచయితలు, కథనాయకులు, నాయికలు ఓటీటీ బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే వెబ్ కంటెంట్ సెన్సార్పై చిత్ర సీమలోనూ చర్చ మొదలైంది.
గతంలో దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ.. "ఓటీటీ కంటెంట్ను సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని అందరూ అంటున్నారు. అది జరిగే పని కాదు. ఇప్పుడు అనేక దేశాల నుంచి ఇన్ని ఓటీటీ వేదికలు వస్తున్నప్పుడు.. వాటిలో వచ్చే కంటెంట్ మొత్తాన్ని సెన్సార్ చేయడం అసాధ్యం. దీనికోసం ఎన్ని సెన్సార్ బోర్డు ఆఫీసుల్ని ఏర్పాటు చేస్తారు? గ్లోబల్గా అందరం ఒకటిగా కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు ఐదారుగురు కూర్చోని.. ఎవరేం చూడొచ్చో, ఏం చూడకూడదు? అని ఎలా నిర్ణయిస్తారు" అని చెప్పుకొచ్చారు.
స్పష్టత రావాలి