స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తదుపరి చిత్ర షూటింగ్ కోసం స్టైలిష్ స్టార్ థాయ్లాండ్ వెళ్లనున్నాడు. ఈ మధ్యనే గ్రాండ్గా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవులలో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ కొరకు యూనిట్ సభ్యులు థాయిలాండ్ వెళ్లనున్నారట. థాయిలాండ్ లోని దట్టమైన అడవుల నేపథ్యంలో నడిచే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపాలని నిర్ణయించారట సుకుమార్.