తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రీదేవి కుటుంబానికి హోమ్​ క్వారంటైన్​ పూర్తి! - జాన్వీ కపూర్​ కుటుంబానికి కరోనా‌ పరీక్షలు

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వి, ఖుషిల క్వారంటైన్ ముగిసింది. ఇటీవలే వారి ఇంట్లో ముగ్గురికి కరోనా రాగా.. సిబ్బంది సహా అందరూ 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. తాజాగా ఆ గడువు ముగిసిందని.. క్షేమంగానే ఉన్నామని తెలిపారు బోనీ.

Boney KapooBoney Kapoor's staff members recover from COVID-19, daughters test negative
జాన్వీ కపూర్​ కుటుంబానికి కరోనా‌ పరీక్షలు..!

By

Published : Jun 6, 2020, 9:02 AM IST

Updated : Jun 6, 2020, 1:50 PM IST

ఇంట్లో పనిచేసిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ రావడం వల్ల.. నిర్మాత బోనీ కపూర్‌ సహా ఆయన కుమార్తెలు జాన్వి, ఖుషి 14 రోజులు హోం క్వారంటైన్​లో ఉన్నారు. తాజాగా అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలన్నీ నెగిటివ్‌ వచ్చినట్లు బోనీ ట్వీట్‌ చేశారు. అందరి ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు.

బోనీ కపూర్​

"నాకు, నా ఇద్దరు కుమార్తెలతోపాటు ముగ్గురు సిబ్బందికి కొవిడ్‌-19 నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని చెప్పడం సంతోషంగా ఉంది. మా 14 రోజుల క్వారంటైన్‌ కాలం ముగిసింది. ఫ్రెష్‌గా ముందుకు సాగబోతున్నాం. కొవిడ్‌ బారినపడ్డ వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. మిగిలిన వారంతా సురక్షితంగా ఉండండి. ప్రభుత్వ సూచనల్ని పాటించండి. ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యుల తరఫున మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. కలిసికట్టుగా మనం కరోనాను ఎదుర్కోవచ్చు"

-- బోనీ కపూర్​

ప్రస్తుతం బోనీ 'వకీల్‌ సాబ్‌' చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. జాన్వి నెట్‌ఫ్లిక్‌ సిరీస్‌ 'ఘోస్ట్‌ స్టోరీస్‌' తర్వాత 'గుంజాన్‌ సక్సేన్‌'లో నటిస్తోంది. శరణ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. ఏప్రిల్‌ 24న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది.

ఇదీ చూడండి: ప్రేమలో పడి అవకాశాలు వదులుకున్న ఆర్తి అగర్వాల్!

Last Updated : Jun 6, 2020, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details