బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్.. ఈ మధ్యే 'భారత్' సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. 2019 ప్రథమార్ధంలో అత్యంత ప్రజాకర్షణ పొందిన చిత్రంగా ఇది నిలిచింది. సామాజిక మాధ్యమాల గణాంకాల ఆధారంగా యూఎస్ స్కోర్ ట్రెండ్స్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
రెండవ స్థానంలో కరణ్ జోహార్ 'కలంక్', ఆ తర్వాతి స్థానాల్లో విక్కీ కౌశల్ 'ఉరి', అమితాబ్ 'బద్లా', అక్షయ్ కుమార్ 'కేసరి', మణికర్ణిక, థాక్రే, గల్లీబాయ్, టోటల్ ధమాల్ ఉన్నాయి. ఇటీవలే విడుదలైన షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్' 10వ స్థానంలో నిలిచింది.