తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్రగ్స్ కేసు విచారణ.. ముంబయికి దీపిక, సారా

డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం గోవా నుంచి ముంబయికి ప్రత్యేక విమానాల్లో పయనమయ్యారు ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్. శుక్రవారం, శనివారం ఎన్​సీబీ అధికారుల ముందు హాజరు కానున్నారు.

By

Published : Sep 24, 2020, 4:42 PM IST

Bollywood drug probe: Deepika cuts short Goa shoot
హీరోయిన్ దీపికా పదుకొణె

బాలీవుడ్​ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం ఎన్​సీబీ ముందు శుక్రవారం హాజరు కానుంది. ఇందులో భాగంగానే గోవాలో తన సినిమా షూటింగ్ మధ్యలో ఆపుచేసి, ముంబయి విమానమెక్కింది. అంతకు ముందు తన న్యాయ బృందంతో కేసు విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ సారా అలీఖాన్​ కూడా గోవా నుంచి ముంబయి బయల్దేరింది.

గోవా విమనాశ్రయంలో హీరోయిన్ సారా అలీఖాన్

బుధవారం ఈమెతోపాటు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్​లకు ఎన్​సీబీ నోటీసులు జారీ చేసింది.

మాదక ద్రవ్యాల వినియోగం కేసులో దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌తో పాటు టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహానూ ఎన్​సీబీ అధికారులు విచారించారు. వీరిద్దరి మధ్య డ్రగ్స్‌ గురించి జరిగిన చాటింగ్‌ వివరాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తిని ఎన్​సీబీ అధికారులు కొన్ని రోజుల పాటు విచారించి అరెస్టు చేశారు. ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు మరో 15మందిని అదుపులోకి తీసుకున్నారు. రియాను విచారించిన క్రమంలో సారా అలీఖాన్‌, రకుల్‌ పేర్లు బయటకు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details