తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2020, 6:31 AM IST

ETV Bharat / sitara

అలా నటించాలంటే చాలా చిరాకేసింది: జాన్వీ

'ధడక్‌' చిత్రంతో కుర్రకారు మనసు దోచింది బాలీవుడ్​ నటి జాన్వీ కపూర్‌. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఈ అమ్మడు నటించిన ఓ వెబ్​సిరీస్​.. న్యూ ఇయర్​ కానుకగా విడుదలైంది. అయితే ఈ చిత్ర షూటింగ్​లో ఎదుర్కొన్న ఓ విషయంపై మాట్లాడిందీ అందాల భామ.

Bollywood Actress Janhvi Kapoor Irritated on sets of Ghost Stories. here why..?
'నర్స్ పాత్ర ఇష్టమే కానీ ఆ కాస్ట్యూమ్​ అంటేనే​ చిరాకు'

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ కీలకపాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ 'ఘోస్ట్‌ స్టోరీస్‌'. జోయా అక్తర్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో జాన్వీ కపూర్‌ నర్స్‌గా కనిపించింది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన ఈ సిరీస్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది. వెబ్​ సిరీస్​లో నటించడంపై హర్షం వ్యక్తం చేసిన ఈ అమ్మడు... నర్స్‌ క్యారెక్టర్​ కోసం వేసుకున్న కాస్ట్యూమ్స్‌తో ఇబ్బందిపడినట్లు చెప్పుకొచ్చింది.

జాన్వీ కపూర్‌

" 'ఘోస్ట్‌ స్టోరీస్‌'లో నేను భాగమవడం ఆనందంగా ఉంది. నర్స్‌ పాత్రలో నటించడం చాలా తేలిక అయినప్పటికీ ఆ డ్రెస్‌, కాస్ట్యూమ్స్‌ వల్ల చెమటలు పట్టేసేవి. అందువల్ల సెట్‌లో చాలా చిరాకుగా అనిపించేది. మరోపక్క నర్స్‌ పాత్రలో నన్ను నేను చూసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఆస్పత్రిలో పనిచేయడం చాలా కష్టమైన విషయం. నా పాత్ర కోసం ఓ నర్స్​ చాలా సాయం చేసింది. ఇప్పటి వరకూ నేను ఇలాంటి పాత్రను పోషించలేదు. జోయా అక్తర్​ వల్ల నా పాత్ర గురించి నాకు మరింత అవగాహన వచ్చింది. ఆమెతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఈ సిరీస్‌ కోసం నేను శాయశక్తులా పనిచేశాను. ఇది నాలోని ఓ కొత్త శైలిని బయటకు తీసుకువచ్చింది"

-- జాన్వీ కపూర్​, సినీ నటి.

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం యుద్ధ పైలట్‌ 'గుంజన్‌ సక్సేనా' బయోపిక్​లో నటిస్తోంది. రాజ్‌కుమార్‌ రావ్‌తో కలిసి 'రూహి అప్జా', కోలిన్‌ డిసౌజ్‌ దర్శకత్వంలో కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి 'దోస్తానా 2'లో సందడి చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details