తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2019, 4:00 PM IST

ETV Bharat / sitara

తమిళంలో పాపులరైన తెలుగువాడు బాబీ సింహా!

తమిళ నటుడు బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా 'డిస్కోరాజా' సినిమాలోని అతడి పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో బర్మా సేతు అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

బాబీసింహా

కోలీవుడ్ నటుడు బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా 'డిస్కోరాజా' చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. సినిమాలోని అతడి పోస్టర్​ను​ విడుదల చేసింది.బర్మా సేతు అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు బాబీ. ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తమిళ చిత్రం 'జిగర్తాండ'(తెలుగులో 'గద్దలకొండ గణేశ్'​) ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు బాబీ సింహా. ఆ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పించాడు. కోలీవుడ్​లో తక్కువ కాలంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించాడు. ఈ ఏడాది.. రజనీకాంత్ నటించిన 'పేట' చిత్రంలోనూ కనిపించాడు.

బాబీ సింహా

1983 నవంబరు 6న హైదరాబాద్​లో పుట్టిన బాబీ సింహా తెలుగు వాడే. చిన్నతనంలోనే అతడి కుటుంబం కొడైకెనాల్​కు మకాం మార్చింది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడీ నటుడు.

'డిస్కోరాజా'కు ఎస్​ఆర్​టీ ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. నభా నటేశ్, పాయల్ రాజ్​పుత్​లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇదీ చదవండి: సినీ నటుడి వాట్సాప్ హ్యాక్​- బూతు మెసేజ్​లతో వేధింపులు

ABOUT THE AUTHOR

...view details