తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కృష్ణ జింకల కేసులో నేడు కోర్టు ముందుకు సల్మాన్​ - సల్మాన్​ఖాన్ కృష్ణ జింకల కేసు

కండలవీరుడు సల్మాన్​ఖాన్.. నేడు కోర్టు ఎదుట హాజరు కానున్నాడు. దాదాపు 20 ఏళ్లుగా నడుస్తున్న ఈ కేసులో సల్మాన్​కు గతేడాది బెయిల్​ మంజూరైంది.

కృష్ణ జింకల కేసులో కోర్టు ముందుకు సల్మాన్​ఖాన్

By

Published : Sep 27, 2019, 5:10 AM IST

Updated : Oct 2, 2019, 4:23 AM IST

నేడుబాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్.. కృష్ణ జింకల వేట కేసులో జోధ్​పూర్ కోర్టు ముందుకు హాజరుకానున్నాడు. అయితే అతడికి గ్యారీ షూటర్​ అనే గ్యాంగ్​స్టర్ నుంచి ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కోర్టుకు హాజరవుతాడా లేదా అనేది ప్రశ్న.

గతేడాది మేలో ఈ కేసులో సల్మాన్​కు బెయిల్ ముంజూరైంది. అప్పటి నుంచి కోర్టు మెట్లేక్కలేదు ఈ నటుడు. ఈ ఏడాది జూలై 4న జరిగిన విచారణ సందర్భంగా, సెప్టెంబరు 27న కోర్టు ముందు హాజరు కావాలని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్ర కుమార్ సొరంగా తీర్పిచ్చారు. లేదంటే సల్మాన్​కు బెయిల్​ రద్దవుతుందని చెప్పారు.

ఈ విషయంపై స్పందించిన స్థానిక పోలీసులు.. భద్రతా కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇన్ని రోజులు సల్మాన్​ హాజరు కాలేదని తెలిపారు.

1998లో 'హమ్ సాత్ సాత్ హైన్' సినిమా షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్‌లోని కంకణి గ్రామంలో.. సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్.. కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది.

ఇది చదవండి: మరుగుజ్జు విలన్​తో వస్తోన్న 'మర్జావాన్​'

Last Updated : Oct 2, 2019, 4:23 AM IST

ABOUT THE AUTHOR

...view details