కమర్షియల్ చిత్రాల్లోనూ, కథాపరమైన సినిమాల్లోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కత్రినాకైఫ్. ప్రస్తుతం సల్మాన్ఖాన్తో 'భారత్'లో నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకులు.. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని ఆమె అభిప్రాయపడింది.
"కమర్షియల్ సినిమాలు చేసే పెద్ద దర్శకులు మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేసేందుకు ముందుకు రావాలి. జోయా అక్తర్తో పాటు కొంతమందితో ఈ విషయం చర్చించా. ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను." -కత్రినా కైఫ్, బాలీవుడ్ హీరోయిన్