తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దిగ్గజ దర్శకులు ఆ సినిమాలు చేయాలి'

బాలీవుడ్​లో కమర్షియల్ చిత్రాలను రూపొందిస్తున్న దర్శకులు.. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు తెరకెక్కించాలని హీరోయిన్​ కత్రినా కైఫ్ అభిప్రాయపడింది. ఆమె నటించిన 'భారత్' జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

By

Published : May 31, 2019, 4:39 PM IST

'వారు మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేయాలి' అంటున్న

కమర్షియల్​ చిత్రాల్లోనూ, కథాపరమైన సినిమాల్లోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కత్రినాకైఫ్. ప్రస్తుతం సల్మాన్​ఖాన్​తో 'భారత్​'లో నటిస్తోంది. బాలీవుడ్​ ప్రముఖ దర్శకులు.. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని ఆమె అభిప్రాయపడింది.

కత్రినా కైఫ్

"కమర్షియల్ సినిమాలు చేసే పెద్ద దర్శకులు మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేసేందుకు ముందుకు రావాలి. జోయా అక్తర్​తో పాటు కొంతమందితో ఈ విషయం చర్చించా. ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను." -కత్రినా కైఫ్, బాలీవుడ్ హీరోయిన్

గత 16 సంవత్సరాల నుంచి పలు భాషల్లో సినిమాలు చేస్తోంది కత్రినా. ఛాలెంజింగ్​ పాత్రలు చేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపింది.

హీరోయిన్ కత్రినా కైఫ్​

"నటిగా కెరీర్​లో విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నా. ఛాలెంజింగ్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నా. ఒకే ఏడాదిలో 'రాజనీతి', 'తీస్​మార్ ఖాన్' అనే విభిన్న సినిమాలు చేశాను. ఎలాంటి పాత్రనైనా ఆస్వాదిస్తూ పనిచేస్తా. " -కత్రినా కైఫ్, బాలీవుడ్ హీరోయిన్

ఇది చదవండి: యుద్ధం ప్రారంభించిన 'ఆర్మీ మేజర్​ మహేశ్'

ABOUT THE AUTHOR

...view details