తెలంగాణ

telangana

By

Published : Aug 4, 2021, 12:17 PM IST

ETV Bharat / sitara

థియేటర్లలో 'బాలీవుడ్‌' సందడి ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల (theaters open) సందడి మొదలైంది. వరసగా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ హిందీ చిత్రసీమలో ఆ హంగామా మొదలు కాలేదు. ఒక్క అక్షయ్‌కుమార్‌ నటించిన 'బెల్‌బాటమ్‌'(Bellbottom movie) ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు భారీ చిత్రాలు సిద్ధంగా ఉన్నా.. విడుదలకు ముందుకు రావడం లేదు. ఎందుకు? బాలీవుడ్‌ నిర్మాతల ఆలోచనేంటి?

Bellbottom movie
బెల్‌బాటమ్‌

అక్షయ్‌కుమార్‌ నిర్ణయాలు వేగంగా ఉంటాయి. అందులో భాగంగానే కరోనా రెండో దశ తర్వాత అందరి కంటే ముందు ఆయన 'బెల్‌బాటమ్‌'(Bellbottom movie) చిత్రంతో థియేటర్లలో (theaters open) అడుగుపెడుతున్నారు. రంజిత్‌ తివారీ తెర కెక్కించిన ఈ చిత్రం స్పై థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో భాగంగా ఈ చిత్రాన్ని త్రీడీలోనూ విడుదల చేయనున్నారు. ఓ పక్క అగ్ర హీరో చిత్రం థియేటర్లలో విడుదలవుతున్నా మరికొందరు ఇంకా ఓటీటీ బాటలోనే వెళుతున్నారు. కెప్టెన్‌ విక్రమ్‌ భత్ర జీవిత కథతో వస్తున్న 'షేర్షా' చిత్రం ఈ నెల 12న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. అజయ్‌దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' 13న డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు యుద్ధం నేపథ్యంగా సాగే చిత్రాలే కావడం విశేషం. వీటిని థియేటర్లలో బాగా ఆస్వాదించొచ్చు అనేది అభిప్రాయం. కానీ దర్శకనిర్మాతలు థియేటర్‌ విడుదలవైపు మొగ్గు చూపలేదు.

వీటి మాటేంటి?

'సూర్యవంశీ', '83' చిత్రాలపై భారీ అంచనాలు

ఏడాది కాలంగా కొన్ని చిత్రాలు థియేటర్లలోకి రావడానికి ఎదురుచూస్తున్నాయి. 'సూర్యవంశీ', '83' చిత్రాలపై భారీ అంచనాలున్నాయి. థియేటర్ల సందడి మొదలైనా వీటి విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. అక్షయ్‌కుమార్‌ హీరోగా రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన 'సూర్యవంశీ'లో అజయ్‌దేవగణ్, రణ్‌వీర్‌సింగ్‌ అతిథి పాత్రలో నటించారు. 1983లో భారత్‌ క్రికెట్‌జట్టు సాధించిన ప్రపంచకప్పు విజయం నేపథ్యంలో '83' తెరకెక్కింది. రణ్‌వీర్‌సింగ్‌.. కెప్టెన్‌ కపిల్‌దేవ్‌గా నటించిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక అలియాభట్‌ వేశ్యగా నటించిన ‘గంగూబాయి కతియావాడి’పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 'బంటీ ఔర్‌ బబ్లీ 2', 'సత్యమేవ జయతే2', 'ఛేహరే' లాంటివి చిత్రీకరణను పూర్తి చేసుకున్నాయి. ఈ బృందాల నుంచి విడుదల విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.

వందశాతం కోసమా..!

అలియాభట్

బాలీవుడ్‌ సినిమాలకు కీలకంగా భావించే దిల్లీ, ముంబయి నగరాల్లో 50శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్‌లకు అనుమతి ఉంది. భారీ బడ్జెట్‌లతో నిర్మించిన సినిమాలకు ఇది ఎంతమాత్రం కలిసి రాదని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. "ఎంతో ఖర్చుతో తెరకెక్కించిన చిత్రాలను సగం సీటింగ్‌ పరిస్థితుల్లో విడుదల చేస్తే కష్టమే. అందుకే భవిష్యత్తు కోసం ఆశగా చూస్తున్నాం. అదే సమయంలో అందరీ ఆరోగ్యమూ ముఖ్యమే. త్వరలోనే పరిస్థితులు పూర్తి సాధారణ స్థితికి వస్తాయి అని ఆశతో ఉన్నాం. అప్పుడు వరసగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి"అని ఓ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత అభిప్రాయపడుతున్నారు. "ఏదీ మన చేతుల్లో లేదు. ఇలాంటి విపత్తుల నుంచి ఎప్పుడు బయటపడతామో చెప్పలేం. పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ జరిగి ప్రజల్లో భయాలుపోయినప్పుడు థియేటర్ల పరిస్థితి మారుతుంది. అది ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేం. అందుకే విడుదల తేదీలపై స్పష్టత రావడం లేదు. 'గంగూబాయి కతియావాడి', 'ఆర్‌ ఆర్‌ ఆర్‌', 'ఎటాక్‌' లాంటి భారీ చిత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదలవుతాయి"అని ఓ ప్రముఖ పంపిణీ దారుడు చెప్పుకొచ్చారు. 'బెల్‌బాటమ్‌' ఆదరణను బట్టి ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఎలా అంటూ అక్షయ్‌కుమార్‌ 'బెల్‌బాటమ్‌'తో వస్తున్నారు. ఈ సినిమాకు మంచి హిట్‌ టాక్‌ వచ్చి ప్రేక్షకులు థియేటర్లకు ధైర్యంగా రావడం మొదలైతే మిగిలిన సినిమాలు వరస కడతాయి. అదే సమయంలో మూడో వేవ్‌ భయాలు ఉండనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ నెలాఖరుకు ఓ అంచనా వస్తుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాతే పెద్ద చిత్రాల విడుదల తేదీ ప్రకటనలొచ్చే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:బెల్​ బాటమ్ ట్రైలర్, వరుడు కావలెను సాంగ్ రిలీజ్..

బాలీవుడ్​లోకి మరో తెలుగు దర్శకుడు!

ABOUT THE AUTHOR

...view details