తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బండ్ల X​ పీవీపీ.. ఠాణాలో పరస్పరం ఫిర్యాదు

ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన విభేదాల కారణంగా టాలీవుడ్ నిర్మాతలు బండ్ల గణేశ్, పీవీపీ.. పోలీస్​ స్టేషన్​లో ఒకరిపై ఒకరు ​కేసులు పెట్టుకున్నారు.

By

Published : Oct 5, 2019, 11:12 AM IST

Updated : Oct 5, 2019, 12:51 PM IST

బండ్ల గణేశ్ వర్సెస్​ పీవీపీ.. పరస్పరం ఫిర్యాదులు

పోలీస్ స్టేషన్​లో నిర్మాత బండ్ల గణేశ్
టాలీవుడ్​కు చెందిన ఇద్దరు నిర్మాతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పొట్లూరి వర ప్రసాద్, బండ్ల గణేశ్ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన విభేదాలు పోలీస్ స్టేషన్​కు చేరాయి. జూబ్లీహిల్స్ పీఎస్​లో గణేశ్​పై వరప్రసాద్ ఫిర్యాదు చేశారు.

ఇదీ కారణం..!
'టెంపర్' సినిమా కోసం ఇచ్చిన డబ్బుల విషయంలో పీవీపీ... ఫిర్యాదు చేశారు. బండ్ల గణేశ్ మనుషులు తన ఇంట్లోకి ప్రవేశించి బెదిరించారని పొట్లూరి వరప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గణేశ్, అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పీఎస్​లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం పొట్లూరి వరప్రసాద్​పై బంజారాహిల్స్ పోలీస్​ స్టేషన్​లోనే ఫిర్యాదు చేశారు బండ్ల గణేశ్. పీవీపీ.. తనను బెదిరించారని కేసు నమోదు చేశారు.

Last Updated : Oct 5, 2019, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details