తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజినీ దర్బార్​లో విలన్​గా బాలీవుడ్ బబ్బర్

బాలీవుడ్​ నటుడు ప్రతీక్ బబ్బర్ రజినీకాంత్ 'దర్బార్' చిత్రంలో విలన్​గా నటించనున్నాడు. 'ఏక్ దివానా థా', 'ధోబీఘాట్'​ చిత్రాల ద్వారా గుర్తింపుతెచ్చుకున్నాడు ప్రతీక్. 'దర్బార్' సినిమా 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

By

Published : Apr 17, 2019, 1:12 PM IST

రజినీ

రజినీకాంత్ దర్బార్ చిత్రంలో బాలీవుడ్ నటుడు విలన్​గా నటించనున్నాడు. హిందీలో 'ఏక్​ దివానా థా', 'ధోబీఘాట్' సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ బబ్బర్.. తాజాగా 'దర్బార్'​ చిత్రంలో చాన్స్ కొట్టేశాడు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్.

ఈ చిత్రంలో రజినీ 25 ఏళ్ల తర్వాత పోలీస్​గా కనిపించనున్నాడు. తొలిసారిగా సూపర్​స్టార్​, ఏ ఆర్ మురుగదాస్​లతో నటించబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు ప్రతీక్.

"ఇంత తక్కువకాలంలో నా కల నిజమౌతుందని అనుకోలేదు. రజినీకాంత్, ఏ ఆర్ మురుగదాస్​లతో కలిసి పనిచేయడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను" -ప్రతీక్ బబ్బర్, బాలీవుడ్ నటుడు.

'దర్బార్' సినిమానే కాకుండా నితీశ్ తివారీ చిచ్ఛోరే, మహేశ్ మంజ్రేకర్ పవర్​, అనుభవ్​ సిన్హా 'అబి తో పార్టీ షురూ హుయీ హై' సినిమాల్లోనూ నటిస్తున్నాడు ప్రతీక్. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'దర్బార్' చిత్రం 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details